ETV Bharat / sitara

రూ.36 వేల కరెంటు బిల్లుతో తాప్సీకి షాక్

author img

By

Published : Jun 28, 2020, 6:50 PM IST

నటి తాప్సీకి విద్యుత్​ కష్టాలు ఎదురయ్యాయి. జూన్​ మాసంలో తన నివాసానికి సంబంధించిన బిల్లు రూ.36 వేలకు చేరింది. ఇంత మొత్తంలో ఎలా వచ్చిందంటూ సదరు విద్యుత్​ సరఫరా సంస్థను ట్విట్టర్​లో నిలదీసింది తాప్సీ.

Taapsee Pannu Shocked With A Rise In Electricity Bill
తాప్సీ ఇంటికి ఒక్కనెలలో రూ.36 వేల కరెంటు బిల్లు!

బాలీవుడ్ బ్యూటీ తాప్సీకి ముంబయి అదానీ కరెంట్​ డిస్ట్రిబ్యూషన్​ సంస్థ షాక్​ ఇచ్చింది. ముంబయిలోని తన నివాసానికి సంబంధించిన విద్యుత్​ వినియోగ బిల్లును అధికంగా విధించారని అసంతృప్తిని వ్యక్తం చేసింది తాప్సీ. లాక్‌డౌన్ కారణంగా మూడు నెలలుగా బిల్లు తీయకుండా వాటన్నిటిని తాజాగా పంపారు. అన్ని శ్లాబులనూ కలిపి ఒక్కనెలలోనే రూ.36 వేల విద్యుత్​ సుంకాన్ని విధించారు. సాధార‌ణ రోజుల క‌న్నా మూడు రెట్లు అద‌నంగా బిల్లు రావడం వల్ల ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆవేద‌న వ్య‌క్తం చేసింది తాప్సీ.

  • And this one is for an apartment where no one stays n it’s only visited once in a week for cleaning purpose @Adani_Elec_Mum I am now worried if someone is actually using the apartment without our knowledge and you have helped us uncover the reality 🤷🏻‍♀️ pic.twitter.com/GeBQUSJaft

    — taapsee pannu (@taapsee) June 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మూడు నెలల లాక్​డౌన్​లో ఎలాంటి కొత్త గృహోపకరణాలు నా అపార్ట్​మెంట్​కు తెచ్చుకోలేదు, వాడనూలేదు. కానీ, చివరి నెలలో మాత్రం ఎలక్ట్రిసిటీ బిల్లు అమాంతం పెరిగిపోయింది. ముంబయి అదానీ ఎలక్ట్రిసిటీ.. మా నుంచి మీరు ఎలాంటి విద్యుత్​కు బిల్లు వసూల్​ చేస్తున్నారు".

- తాప్సీ, కథానాయిక

తాప్సీ నివాసంలో మూడు నెలలకు వచ్చిన విద్యుత్​ బిల్లులలో ఒక్క జూన్​లోనే రూ.36 వేలకు రసీదు పంపారు. మే నెలలో మాత్రం కేవలం రూ.3,850 బిల్లు వచ్చినట్లు ఉంది. తనకున్న మరో ఆపార్ట్​మెంట్​లో ఎవరూ ఉండకపోయినా రూ.8,640 విద్యుత్​ వాడకపు బిల్లును విధించారని.. అందులో కేవలం వారం వారం శుభ్రపరచడానికే వెళ్తామని తెలిపింది తాప్సీ.

ఈ విద్యుత్​ బిల్లుల కష్టాలు ఇప్పటికే అనేక మంది ప్రముఖులకు ఎదురయ్యాయి. వారిలో బాలీవుడ్​ ప్రముఖులు వీర్​ దాస్​, అమైరా దస్తూర్​, తుషార్, షట్లర్​ గుత్తా జ్వాలా ఉన్నారు.

ఇదీ చూడండి...

'సుశాంత్​ ఏ ఆడిషన్​లోనూ విఫలమవ్వలేదు'

బాలీవుడ్ బ్యూటీ తాప్సీకి ముంబయి అదానీ కరెంట్​ డిస్ట్రిబ్యూషన్​ సంస్థ షాక్​ ఇచ్చింది. ముంబయిలోని తన నివాసానికి సంబంధించిన విద్యుత్​ వినియోగ బిల్లును అధికంగా విధించారని అసంతృప్తిని వ్యక్తం చేసింది తాప్సీ. లాక్‌డౌన్ కారణంగా మూడు నెలలుగా బిల్లు తీయకుండా వాటన్నిటిని తాజాగా పంపారు. అన్ని శ్లాబులనూ కలిపి ఒక్కనెలలోనే రూ.36 వేల విద్యుత్​ సుంకాన్ని విధించారు. సాధార‌ణ రోజుల క‌న్నా మూడు రెట్లు అద‌నంగా బిల్లు రావడం వల్ల ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆవేద‌న వ్య‌క్తం చేసింది తాప్సీ.

  • And this one is for an apartment where no one stays n it’s only visited once in a week for cleaning purpose @Adani_Elec_Mum I am now worried if someone is actually using the apartment without our knowledge and you have helped us uncover the reality 🤷🏻‍♀️ pic.twitter.com/GeBQUSJaft

    — taapsee pannu (@taapsee) June 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మూడు నెలల లాక్​డౌన్​లో ఎలాంటి కొత్త గృహోపకరణాలు నా అపార్ట్​మెంట్​కు తెచ్చుకోలేదు, వాడనూలేదు. కానీ, చివరి నెలలో మాత్రం ఎలక్ట్రిసిటీ బిల్లు అమాంతం పెరిగిపోయింది. ముంబయి అదానీ ఎలక్ట్రిసిటీ.. మా నుంచి మీరు ఎలాంటి విద్యుత్​కు బిల్లు వసూల్​ చేస్తున్నారు".

- తాప్సీ, కథానాయిక

తాప్సీ నివాసంలో మూడు నెలలకు వచ్చిన విద్యుత్​ బిల్లులలో ఒక్క జూన్​లోనే రూ.36 వేలకు రసీదు పంపారు. మే నెలలో మాత్రం కేవలం రూ.3,850 బిల్లు వచ్చినట్లు ఉంది. తనకున్న మరో ఆపార్ట్​మెంట్​లో ఎవరూ ఉండకపోయినా రూ.8,640 విద్యుత్​ వాడకపు బిల్లును విధించారని.. అందులో కేవలం వారం వారం శుభ్రపరచడానికే వెళ్తామని తెలిపింది తాప్సీ.

ఈ విద్యుత్​ బిల్లుల కష్టాలు ఇప్పటికే అనేక మంది ప్రముఖులకు ఎదురయ్యాయి. వారిలో బాలీవుడ్​ ప్రముఖులు వీర్​ దాస్​, అమైరా దస్తూర్​, తుషార్, షట్లర్​ గుత్తా జ్వాలా ఉన్నారు.

ఇదీ చూడండి...

'సుశాంత్​ ఏ ఆడిషన్​లోనూ విఫలమవ్వలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.