బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు పాల్పడే ముందు రోజంతా ఒంటరిగా గడిపాడని సీబీఐ విచారణలో వెలుగులోకి వచ్చింది. ఓ మీడియా నివేదిక ప్రకారం, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తులో భాగంగా సుశాంత్ మరణానికి ముందు రోజు అతడి చరవాణి చేసిన కార్యకలాపాల గురించి వివరాలు సేకరించారు. దీని ద్వారా చనిపోయే ముందు రోజు మాత్రమే అతడు ఒంటరిగా గడిపాడని తెలుసుకున్నారు.
సుశాంత్ కాల్కు స్పందించలేదు
సుశాంత్ మృతి చెందిన ముందు రోజు గదిలో ఒంటరిగా ఉన్నాడని.. ఎవ్వరితోనూ మాట్లాడలేదని తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందురోజు తన ప్రేయసి రియా చక్రవర్తికి అర్ధరాత్రి దాటిన తర్వాత 1:47 గంటలకు సుశాంత్ ఫోన్ చేసినట్లు నివేదిక పేర్కొంది. 1:51 గంటలకు స్నేహితుడైన మహేశ్ శెట్టికి కాల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ సుశాంత్ ఫోన్కాల్కు స్పందించలేదు.
ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రస్తుతం తుది దర్యాప్తు చేస్తుందని.. అందులో ఎలాంటి గందరగోళం లేకుండా పక్కా సమాచారం సేకరిస్తున్నామని ఓ అధికారి వెల్లడించారు. సెప్టెంబరు 17న వైద్య బృందంతో సమావేశానికి ముందు ఈ కేసులో హత్య జరిగే పరిణామాలను అంచనా వేసే అవకాశం ఉంది.
సుశాంత్ మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఆభియోగాలు ఎదుర్కొంటున్న హీరో ప్రేయసి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి ఇప్పటికే అరెస్టు అయ్యారు. సుశాంత్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో పాట నార్కోటిక్క్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లు దర్యాప్తు చేస్తున్నాయి.