ETV Bharat / sitara

కొరియర్​లో రియా ఇంటికి డ్రగ్స్ సరఫరా

author img

By

Published : Sep 12, 2020, 4:19 PM IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ ఎన్​సీబీకి వెల్లడించారు.

Sushant and Rhea couriered 500g marijuana to her home during lockdown
కొరియర్​లో రియా ఇంటికి డ్రగ్స్ సరఫరా

బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి కేసు ఊహించని విధంగా మలుపులు తిరుగుతోంది. విచారణలో భాగంగా ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని రియాతోపాటు ఆమె సోదరుడు షోవిక్‌ ఎన్‌సీబీకి వెల్లడించారు.

లాక్‌డౌన్‌ సందర్భంగా ఏప్రిల్‌ నెలలో సుశాంత్‌‌.. తన ప్రేయసి రియా చక్రవర్తితో కలిసి కొన్నిరోజులు ఆమె ఇంట్లోనే ఉండాలనుకున్నాడు. ఆ తర్వాత సుశాంత్‌-రియా కలిసి 500 గ్రాముల మత్తుపదార్థాలను ప్యాక్‌చేసి కొరియర్‌లో ఆ ఇంటికి పంపించాలనుకున్నారు. అయితే ఎవరికీ అనుమానం రాకుండా గృహోపకరణాలతో డ్రగ్స్‌ను పార్సిల్ చేశారు. అనంతరం సుశాంత్‌ దగ్గర పనిచేసే దీపేశ్‌ సావంత్‌ సదరు కొరియర్‌ ఏజెన్సీ బాయ్‌తో రియా ఇంటికి పార్సిల్​ను పంపించగా ఆమె సోదరుడు షోవిక్‌ దాన్ని అందుకున్నట్లు విచారణలో తేలింది. దీంతో ఎన్‌సీబీ అధికారులు సదరు కొరియర్‌ ఏజెన్సీ, బాయ్‌ని కూడా విచారిస్తున్నారు.

ఆమె సెల్‌లో ఫ్యాన్‌, బెడ్‌ సౌకర్యాల్లేవు

సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో భాగంగా డ్రగ్స్‌ కోణంపై మూడు రోజుల విచారణ అనంతరం ఈ నెల 8న రియా చక్రవర్తిని పోలీసులు అరెస్టు చేశారు. 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీకి కోర్టు అనుమతించడం వల్ల అధికారులు ఆమెను బైకుల్లా మహిళా జైలుకు తరలించారు. ఇంద్రాణి ముఖర్జీ సెల్‌కు అతిసమీపంలో ఉన్న సెల్‌లో రియా చక్రవర్తి ఉంటోంది. అయితే ఆ సెల్‌లో ఫ్యాన్‌, బెడ్‌ లాంటి సౌకర్యాల్లేవు. కేవలం ఓ చాపను మాత్రమే ఆమెకు అందించారు. కాగా బెయిల్‌ కోసం రియా దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి కేసు ఊహించని విధంగా మలుపులు తిరుగుతోంది. విచారణలో భాగంగా ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని రియాతోపాటు ఆమె సోదరుడు షోవిక్‌ ఎన్‌సీబీకి వెల్లడించారు.

లాక్‌డౌన్‌ సందర్భంగా ఏప్రిల్‌ నెలలో సుశాంత్‌‌.. తన ప్రేయసి రియా చక్రవర్తితో కలిసి కొన్నిరోజులు ఆమె ఇంట్లోనే ఉండాలనుకున్నాడు. ఆ తర్వాత సుశాంత్‌-రియా కలిసి 500 గ్రాముల మత్తుపదార్థాలను ప్యాక్‌చేసి కొరియర్‌లో ఆ ఇంటికి పంపించాలనుకున్నారు. అయితే ఎవరికీ అనుమానం రాకుండా గృహోపకరణాలతో డ్రగ్స్‌ను పార్సిల్ చేశారు. అనంతరం సుశాంత్‌ దగ్గర పనిచేసే దీపేశ్‌ సావంత్‌ సదరు కొరియర్‌ ఏజెన్సీ బాయ్‌తో రియా ఇంటికి పార్సిల్​ను పంపించగా ఆమె సోదరుడు షోవిక్‌ దాన్ని అందుకున్నట్లు విచారణలో తేలింది. దీంతో ఎన్‌సీబీ అధికారులు సదరు కొరియర్‌ ఏజెన్సీ, బాయ్‌ని కూడా విచారిస్తున్నారు.

ఆమె సెల్‌లో ఫ్యాన్‌, బెడ్‌ సౌకర్యాల్లేవు

సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో భాగంగా డ్రగ్స్‌ కోణంపై మూడు రోజుల విచారణ అనంతరం ఈ నెల 8న రియా చక్రవర్తిని పోలీసులు అరెస్టు చేశారు. 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీకి కోర్టు అనుమతించడం వల్ల అధికారులు ఆమెను బైకుల్లా మహిళా జైలుకు తరలించారు. ఇంద్రాణి ముఖర్జీ సెల్‌కు అతిసమీపంలో ఉన్న సెల్‌లో రియా చక్రవర్తి ఉంటోంది. అయితే ఆ సెల్‌లో ఫ్యాన్‌, బెడ్‌ లాంటి సౌకర్యాల్లేవు. కేవలం ఓ చాపను మాత్రమే ఆమెకు అందించారు. కాగా బెయిల్‌ కోసం రియా దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.