ETV Bharat / sitara

ఓటీటీలో 'శ్రీకారం', 'తెల్లవారితే గురువారం'

author img

By

Published : Apr 15, 2021, 7:41 PM IST

ఇప్పటికే థియేటర్లలో విడుదలై ఆకట్టుకున్న పలు చిత్రాలు ఓటీటీ వేదికగా విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం (ఏప్రిల్​ 16) విడుదల కానున్న సినిమాలేంటో తెలుసుకుందాం..

sreekaram
శ్రీకారం

ఈ ఏడాది థియేటర్‌లో ప్రేక్షకులను అలరించిన పలు చిత్రాలు ఇప్పుడు ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఏప్రిల్​ 16(శుక్రవారం) విడుదల కానున్న సినిమాలేంటో చూద్దాం.

చదువుకున్న యువత వ్యవసాయ రంగంలో అడుగుపెడితే ఎలాంటి మార్పులు వస్తాయి? అనే కథాంశంతో తెరకెక్కిన సినిమా 'శ్రీకారం'. కిశోర్ బి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శర్వానంద్, ప్రియాంక జంటగా నటించారు. ఈ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 16) రోజున సన్ ​నెక్ట్స్​లో స్ట్రీమింగ్​ కానుంది.

శ్రీ సింహా కోడూరి, మిషా నారంగ్‌, చిత్ర శుక్లా ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'తెల్లవారితే గురువారం'. మణికాంత్‌ గెల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 27న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఏప్రిల్​ 16(శుక్రవారం) తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా'లో విడుదల కానుంది. వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంయుక్తంగా నిర్మించారు. రాజీవ్‌ కనకాల, సత్య, అజయ్‌, వైవా హర్ష కీలకపాత్రలు పోషించారు. కాలభైరవ సంగీతం అందించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ ఏడాది థియేటర్‌లో ప్రేక్షకులను అలరించిన పలు చిత్రాలు ఇప్పుడు ఓటీటీల్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఏప్రిల్​ 16(శుక్రవారం) విడుదల కానున్న సినిమాలేంటో చూద్దాం.

చదువుకున్న యువత వ్యవసాయ రంగంలో అడుగుపెడితే ఎలాంటి మార్పులు వస్తాయి? అనే కథాంశంతో తెరకెక్కిన సినిమా 'శ్రీకారం'. కిశోర్ బి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శర్వానంద్, ప్రియాంక జంటగా నటించారు. ఈ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 16) రోజున సన్ ​నెక్ట్స్​లో స్ట్రీమింగ్​ కానుంది.

శ్రీ సింహా కోడూరి, మిషా నారంగ్‌, చిత్ర శుక్లా ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'తెల్లవారితే గురువారం'. మణికాంత్‌ గెల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 27న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఏప్రిల్​ 16(శుక్రవారం) తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా'లో విడుదల కానుంది. వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంయుక్తంగా నిర్మించారు. రాజీవ్‌ కనకాల, సత్య, అజయ్‌, వైవా హర్ష కీలకపాత్రలు పోషించారు. కాలభైరవ సంగీతం అందించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.