ETV Bharat / sitara

జాన్వీ​ తొలి తెలుగు సినిమా అదే అవుతుందా?

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్​ టాలీవుడ్​లో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. త్రివిక్రమ్​- ఎన్టీఆర్​ కాంబినేషన్​లో తెరకెక్కనున్న చిత్రంలో హీరోయిన్​గా నటించనుందని సినీ వర్గాల్లో టాక్​ నడుస్తోంది.

author img

By

Published : Sep 5, 2020, 6:46 AM IST

janhvi kapoor
జాన్వీ కపూర్

అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ తెలుగు తెరకు పరిచయం కావడానికి రంగం సిద్ధమైందా? ఎప్పటినుంచో తెలుగు ప్రేక్షకులు వేచి చూస్తున్న తరుణం రానుందా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తీయనున్నారు. ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లాలి కానీ కరోనా వైరస్‌ ప్రభావంతో ఇంకాస్త ఆలస్యం కానుంది.

అయితే, ఇటీవల చిత్ర నిర్మాత నాగ వంశీ ట్వీట్‌ చేస్తూ, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ నుంచి తమకు సందేశాలు వస్తున్నాయని, షూటింగ్‌ మొదలు పెట్టగానే అన్ని వివరాలు వెల్లడిస్తామని అన్నారు. ఈ చిత్రంలో కథానాయిక ఎవరన్న ప్రశ్న అందరిలోనూ నెలకొంది. సరిగ్గా ఈ సమయంలోనే జాన్వీకపూర్‌ పేరు వినిపిస్తోంది. తారక్​కు జోడీగా కొత్త హీరోయిన్‌ అయితే బాగుంటుందని త్రివిక్రమ్‌ భావిస్తున్నారట. ప్రస్తుతం కథానాయిక వేట కొనసాగుతోందని సమాచారం. వారిలో జాన్వీకపూర్‌ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్‌ తుది దశకు చేరుకుందని.. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

janhvi kapoor
జాన్వీ కపూర్

ఇప్పటికే జాన్వీ తెలుగు తెరకు పరిచయం కావాల్సి ఉంది. పూరీ-విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లోని 'ఫైటర్‌'లో చేయాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో అనన్య పాండే వచ్చింది. జాన్వీ నటించిన 'గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌' చిత్రం ఇటీవలే ఓటీటీ వేదికగా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

దర్శకధీరుడు రాజమౌళి తీస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో ఎన్టీఆర్ నటిస్తున్నారు. రామ్‌చరణ్‌ మరో కథానాయకుడు. కరోనా కారణంగా షూటింగ్‌ తాత్కాలికంగా వాయిదా పడింది. తారక్​పైన కీలక సన్నివేశాలు తీయాల్సి ఉంది. ఇది పూర్తయిన తర్వాతే తారక్‌-త్రివిక్రమ్‌ సినిమా మొదలవుతుంది.

అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ తెలుగు తెరకు పరిచయం కావడానికి రంగం సిద్ధమైందా? ఎప్పటినుంచో తెలుగు ప్రేక్షకులు వేచి చూస్తున్న తరుణం రానుందా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తీయనున్నారు. ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లాలి కానీ కరోనా వైరస్‌ ప్రభావంతో ఇంకాస్త ఆలస్యం కానుంది.

అయితే, ఇటీవల చిత్ర నిర్మాత నాగ వంశీ ట్వీట్‌ చేస్తూ, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ నుంచి తమకు సందేశాలు వస్తున్నాయని, షూటింగ్‌ మొదలు పెట్టగానే అన్ని వివరాలు వెల్లడిస్తామని అన్నారు. ఈ చిత్రంలో కథానాయిక ఎవరన్న ప్రశ్న అందరిలోనూ నెలకొంది. సరిగ్గా ఈ సమయంలోనే జాన్వీకపూర్‌ పేరు వినిపిస్తోంది. తారక్​కు జోడీగా కొత్త హీరోయిన్‌ అయితే బాగుంటుందని త్రివిక్రమ్‌ భావిస్తున్నారట. ప్రస్తుతం కథానాయిక వేట కొనసాగుతోందని సమాచారం. వారిలో జాన్వీకపూర్‌ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్‌ తుది దశకు చేరుకుందని.. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

janhvi kapoor
జాన్వీ కపూర్

ఇప్పటికే జాన్వీ తెలుగు తెరకు పరిచయం కావాల్సి ఉంది. పూరీ-విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లోని 'ఫైటర్‌'లో చేయాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో అనన్య పాండే వచ్చింది. జాన్వీ నటించిన 'గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌' చిత్రం ఇటీవలే ఓటీటీ వేదికగా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

దర్శకధీరుడు రాజమౌళి తీస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో ఎన్టీఆర్ నటిస్తున్నారు. రామ్‌చరణ్‌ మరో కథానాయకుడు. కరోనా కారణంగా షూటింగ్‌ తాత్కాలికంగా వాయిదా పడింది. తారక్​పైన కీలక సన్నివేశాలు తీయాల్సి ఉంది. ఇది పూర్తయిన తర్వాతే తారక్‌-త్రివిక్రమ్‌ సినిమా మొదలవుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.