వంద పాటలు.. వంద మంది గాయనీ గాయకులు... ఓ వేదిక. 'గాన గంధర్వుడి నూరు గళాల స్వరార్చన' పేరుతో నిర్వహించనున్న ఈ ఘట్టం సంతోషం - సుమన్ టీవీ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవ వేదికపై ఆవిష్కృతం కానుంది.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన 40 వేల పైచిలుకు పాటల్లోని ఆణిముత్యాల్ని ఈ వేదికపై వంద మంది గాయకులు ఆలపించనున్నారు. నవంబర్ 14న మధ్యాహ్నం 3 గంటలకు ఈ స్వరార్చన ప్రారంభం అవుతుందని పురస్కార ప్రదానోత్సవ నిర్వాహకులు సురేశ్ కొండేటి ఓ ప్రకటనలో తెలిపారు.

ఇవీ చదవండి: