ETV Bharat / sitara

మెగాస్టార్ ద్వయం: తోటలో ఒకరు కెమెరాతో మరొకరు

లాక్​డౌన్​తో ఇంట్లోనే ఉంటున్న పలువురు సినీ సెలబ్రిటీలు.. తమకిష్టమైన అభిరుచులవైపు దృష్టి సారిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, మమ్ముట్టి, తమన్నా, సమంత, పూజాహెగ్డే తదితరులు ఉన్నారు.

author img

By

Published : Jun 26, 2020, 9:47 AM IST

Updated : Jun 26, 2020, 11:44 AM IST

South stars who revisited old hobbies during lockdown
లాక్​డౌన్​లో పాత అభిరుచులవైపు మీ అభిమాన తారలు

కరోనా లాక్​డౌన్​ అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమపైనా తీవ్ర ప్రభావం చూపింది. దీంతో నిత్యం షూటింగ్​లతో బిజీగా ఉండే తారలకు, ఎంతో తీరిక సమయం దొరికింది. కొందరు కుటుంబంతో సరదాగా గడుపుతుంటే.. మరికొందరు గత స్మృతులను గుర్తు తెచ్చుకొని వాటిని అభిమానులతో పంచుకుంటున్నారు. వీరిలో కొంతమంది తమ పాత అభిరుచులవైపు అడుగులేస్తున్నారు. సూపర్​స్టార్​ మమ్ముట్టి ఫొటోగ్రఫర్​గా మారగా, మెగాస్టార్​ చిరంజీవి తోటలో మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపించారు. ముద్దుగుమ్మ సమంత అక్కినేని సొంతంగా తన ఇంట్లోనే క్యాబేజీ పండిస్తోంది. వీరితో పాటే ఇతర నటీనటులు ఏమేం చేస్తున్నారో చూసేద్దాం.

మలయాళ మెగాస్టార్​ మమ్ముట్టి ఫొటోగ్రాఫర్​గా దర్శనమిచ్చారు. తాను తీసిన ఓ ఫొటోలను ఇన్​స్టాలో పోస్ట్ చేశారు.

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. కరోనాపై అవగాహనతో పాటు, సినీ పరిశ్రమలోని విశేషాలను ఎప్పటికప్పుడూ తెలియజేస్తున్నారు. ప్రకృతిని కాపాడుకోవాలని సందేశమిస్తూ.. ఉద్యానవనంలో మొక్కలకు నీరు పోస్తున్న ఫొటోను ఇటీవలే షేర్​ చేశారు.

లాక్​డౌన్​ వేళ ముద్దుగుమ్మ సమంత.. తన ఇంటి టెర్రస్​ను గార్డెన్​గా మార్చేసింది. అందులో క్యాబేజీని పండిస్తోంది. దీని అప్​డేట్స్​ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది.

ప్రస్తుతం కుటుంబంతో గడుపుతున్న హీరో దుల్కర్​ సల్మాన్.. తన తోటలో పండే గూస్​బెర్రీలకు సంబంధించిన ఫొటోను షేర్​ చేశాడు. చెట్టెక్కి పండ్లను కోయడమంటే తనకెంతో ఇష్టమని చెప్పాడు. ఇలా తన చిన్ననాటి అభిరుచులను గుర్తు చేసుకున్నాడు.

హీరోయిన్ పూజాహెగ్డే.. తను స్వయంగా చేసిన వంటలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటోంది. ఇటీవలే క్యారెట్​ కేక్​ తయారు చేసిన ఈ భామ.. తన కుటుంబానికి వంట చేసి పెట్టడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది.

టాలీవుడ్​ హీరో విజయ్​ దేవరకొండ తన కుటుంబంతో కలిసి ఇండోర్​ గేమ్స్​ అడుతున్నాడు. ఇటీవలే పోస్ట్ చేసిన ఫొటోలో, అమ్మతో కలిసి బోర్డు గేమ్స్​ ఆడుతూ కనిపించాడు.

నటి​ మాళవిక మోహనన్​.. ఈ లాక్​డౌన్​ సమయాన్ని పుస్తకాలు చదివేందుకు ఉపయోగించుకుంటోంది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

లాక్​డౌన్​లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని సూచిస్తున్న మిల్కీబ్యూటీ తమన్నా.. ఎక్కువగా వంటలు చేస్తూ సమయాన్ని ఆస్వాదిస్తోంది.

ఇదీ చూడండి:మీ కళ్లను మోసం చేసే రజనీకాంత్ లుక్

కరోనా లాక్​డౌన్​ అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమపైనా తీవ్ర ప్రభావం చూపింది. దీంతో నిత్యం షూటింగ్​లతో బిజీగా ఉండే తారలకు, ఎంతో తీరిక సమయం దొరికింది. కొందరు కుటుంబంతో సరదాగా గడుపుతుంటే.. మరికొందరు గత స్మృతులను గుర్తు తెచ్చుకొని వాటిని అభిమానులతో పంచుకుంటున్నారు. వీరిలో కొంతమంది తమ పాత అభిరుచులవైపు అడుగులేస్తున్నారు. సూపర్​స్టార్​ మమ్ముట్టి ఫొటోగ్రఫర్​గా మారగా, మెగాస్టార్​ చిరంజీవి తోటలో మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపించారు. ముద్దుగుమ్మ సమంత అక్కినేని సొంతంగా తన ఇంట్లోనే క్యాబేజీ పండిస్తోంది. వీరితో పాటే ఇతర నటీనటులు ఏమేం చేస్తున్నారో చూసేద్దాం.

మలయాళ మెగాస్టార్​ మమ్ముట్టి ఫొటోగ్రాఫర్​గా దర్శనమిచ్చారు. తాను తీసిన ఓ ఫొటోలను ఇన్​స్టాలో పోస్ట్ చేశారు.

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. కరోనాపై అవగాహనతో పాటు, సినీ పరిశ్రమలోని విశేషాలను ఎప్పటికప్పుడూ తెలియజేస్తున్నారు. ప్రకృతిని కాపాడుకోవాలని సందేశమిస్తూ.. ఉద్యానవనంలో మొక్కలకు నీరు పోస్తున్న ఫొటోను ఇటీవలే షేర్​ చేశారు.

లాక్​డౌన్​ వేళ ముద్దుగుమ్మ సమంత.. తన ఇంటి టెర్రస్​ను గార్డెన్​గా మార్చేసింది. అందులో క్యాబేజీని పండిస్తోంది. దీని అప్​డేట్స్​ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది.

ప్రస్తుతం కుటుంబంతో గడుపుతున్న హీరో దుల్కర్​ సల్మాన్.. తన తోటలో పండే గూస్​బెర్రీలకు సంబంధించిన ఫొటోను షేర్​ చేశాడు. చెట్టెక్కి పండ్లను కోయడమంటే తనకెంతో ఇష్టమని చెప్పాడు. ఇలా తన చిన్ననాటి అభిరుచులను గుర్తు చేసుకున్నాడు.

హీరోయిన్ పూజాహెగ్డే.. తను స్వయంగా చేసిన వంటలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటోంది. ఇటీవలే క్యారెట్​ కేక్​ తయారు చేసిన ఈ భామ.. తన కుటుంబానికి వంట చేసి పెట్టడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది.

టాలీవుడ్​ హీరో విజయ్​ దేవరకొండ తన కుటుంబంతో కలిసి ఇండోర్​ గేమ్స్​ అడుతున్నాడు. ఇటీవలే పోస్ట్ చేసిన ఫొటోలో, అమ్మతో కలిసి బోర్డు గేమ్స్​ ఆడుతూ కనిపించాడు.

నటి​ మాళవిక మోహనన్​.. ఈ లాక్​డౌన్​ సమయాన్ని పుస్తకాలు చదివేందుకు ఉపయోగించుకుంటోంది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

లాక్​డౌన్​లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని సూచిస్తున్న మిల్కీబ్యూటీ తమన్నా.. ఎక్కువగా వంటలు చేస్తూ సమయాన్ని ఆస్వాదిస్తోంది.

ఇదీ చూడండి:మీ కళ్లను మోసం చేసే రజనీకాంత్ లుక్

Last Updated : Jun 26, 2020, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.