ETV Bharat / sitara

Sonu Sood: 'దేశవ్యాప్తంగా 18 ఆక్సిజన్ ప్లాంట్లు'

author img

By

Published : Jun 10, 2021, 9:51 AM IST

లాక్​డౌన్ మొదలైనప్పటి నుంచి తన వంతు సాయం చేస్తూ, మంచి మనసు చాటుకున్నారు సోనూసూద్. ఇటీవల కాలంలో కరోనా సెకండ్ వేవ్​లో ఆక్సిజన్​ లేక చాలామంది మరణిస్తుండటం చూసి చలించిపోయిన ఆయన.. దేశవ్యాప్తంగా 18 ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టనున్నట్లు తెలిపారు.

Sonu Sood to set up 18 oxygen plants across various states
సోనూసూద్

ప్రముఖ నటుడు సోనూసూద్(sonu sood).. దేశవ్యాప్తంగా 18 చోట్ల ఆక్సిజన్​(OXYGEN) ప్లాంట్లు పెట్టనున్నట్లు హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని నెల్లూరు, కర్నూలు నుంచి ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. త్వరలో తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్​లో సహా పలు రాష్ట్రాల్లో సోనూ, ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.

Sonu Sood to set up 18 oxygen plants
సోనూసూద్

"గత కొన్నినెలల నుంచి మనం ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం. ఈ సమస్యను దాని మూలాల నుంచి నిర్మూలించేందుకు నేను, నా బృందం ఏం చేయాలో ఆలోచించి, వీలైనన్ని ఆక్సిజన్​ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఆక్సిజన్ దొరకక దేశంలో ఏ వ్యక్తి చనిపోకూడదు. ఇదే మా లక్ష్యం" అని సోనూసూద్ చెప్పారు.

సోనూసూద్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) 'ఆచార్య'లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలానే తాను ప్రధాన పాత్రలో 'కిసాన్'(Kisaan) సినిమాను ప్రకటించారు. త్వరలో దాని షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇవీ చదవండి:

ప్రముఖ నటుడు సోనూసూద్(sonu sood).. దేశవ్యాప్తంగా 18 చోట్ల ఆక్సిజన్​(OXYGEN) ప్లాంట్లు పెట్టనున్నట్లు హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని నెల్లూరు, కర్నూలు నుంచి ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. త్వరలో తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్​లో సహా పలు రాష్ట్రాల్లో సోనూ, ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.

Sonu Sood to set up 18 oxygen plants
సోనూసూద్

"గత కొన్నినెలల నుంచి మనం ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం. ఈ సమస్యను దాని మూలాల నుంచి నిర్మూలించేందుకు నేను, నా బృందం ఏం చేయాలో ఆలోచించి, వీలైనన్ని ఆక్సిజన్​ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఆక్సిజన్ దొరకక దేశంలో ఏ వ్యక్తి చనిపోకూడదు. ఇదే మా లక్ష్యం" అని సోనూసూద్ చెప్పారు.

సోనూసూద్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) 'ఆచార్య'లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలానే తాను ప్రధాన పాత్రలో 'కిసాన్'(Kisaan) సినిమాను ప్రకటించారు. త్వరలో దాని షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.