ETV Bharat / sitara

ముందు ప్రేమకథ.. తర్వాత 'హిరణ్య కశ్యప'

author img

By

Published : Oct 9, 2020, 9:51 PM IST

విభిన్న చిత్రాల దర్శకుడు గుణశేఖర్​ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబోతున్న 'హిరణ్య కశ్యప' ప్రాజెక్టును ప్రస్తుతానికి పక్కనపెట్టారు. నటీనటుల డేట్స్​ కుదరకపోవడం వల్ల దాని కంటే ముందుగా 'శాకుంతలం' అనే ప్రేమకథా చిత్రాన్ని రూపొందించనున్నట్లు వెల్లడించారు.

Shakuntam will be made before Hiranya Kashyapa: Gunasekhar
'హిరణ్య కశ్యప' కంటే ముందే 'శాకుంతలం' ప్రేమకథ

తెలుగు చిత్రపరిశ్రమలో పౌరాణిక, సాంఘీక చిత్రాల దర్శకునిగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గుణశేఖర్‌. 'రుద్రమదేవి' చిత్రం తర్వాత రానా ప్రధానపాత్రలో 'హిరణ్య కశ్యప' అనే చిత్రాన్ని రూపొందించనున్నట్లు గతంలోనే ప్రకటించారు. ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని ఎప్పుడో సెట్స్‌పైకి తీసుకెళ్లాల్సినా.. కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఇంకా పట్టాలెక్కలేదు.

లాక్‌డౌన్‌ కారణంగా అన్ని చిత్రాల ప్రణాళికలూ తారుమారయ్యాయి. నటీనటుల డేట్స్‌ కుదరకపోవడం వల్ల దర్శకులు ఆ ప్రాజెక్టును పక్కనపెట్టి మరో సినిమా తెరకెక్కించే సందర్భాలను సినీపరిశ్రమలో చూస్తూనే ఉన్నాం. గుణశేఖర్‌ కూడా ఇదే అనుసరిస్తున్నారు. 'హిరణ్య కశ్యప' చిత్రీకరణకు మరింత సమయం ఉండటం వల్ల ఈ గ్యాప్‌లో మరో చిత్రం ప్రకటించారు గుణశేఖర్​. తాజాగా టైటిల్‌ ఖరారు చేసి, మోషన్‌ పోస్టర్‌ వీడియో పంచుకున్నారు. ఇతిహాస ప్రేమకథతో కూడిన ఈ చిత్రానికి 'శాకుంతలం' అనే టైటిల్​ను ఖరారు చేశారు.

  • వెండితెరపై 'హిరణ్యకశ్యప'లో నరసింహావతారాన్ని సాక్షాత్కరింపజేసే ముందు ...
    భారతాన ఆదిపర్వంలోని ఆహ్లాదకర ప్రేమకథని ఆవిష్కరిస్తూ...🙏

    — Gunasekhar (@Gunasekhar1) October 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"హిరణ్య కశ్యప'గా వెండితెరపై నరసింహ అవతారాన్ని చూపించడానికి ముందు మహాభారతం ఆదిపర్వంలోని ప్రేమకథను చూపిస్తున్నాం" అని గుణశేఖర్‌ ట్వీట్​ చేశారు. ఈ చిత్రానికి నిర్మాతగా గుణ నీలిమ వ్యవహరిస్తుండగా.. మణిశర్మ సంగీతాన్ని అందించనున్నారు. ఇందులోని తారాగణం వివరాలు తెలియాల్సిఉంది.

ముందు ప్రేమకథ.. తర్వాత 'హిరణ్య కశ్యప'

తెలుగు చిత్రపరిశ్రమలో పౌరాణిక, సాంఘీక చిత్రాల దర్శకునిగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గుణశేఖర్‌. 'రుద్రమదేవి' చిత్రం తర్వాత రానా ప్రధానపాత్రలో 'హిరణ్య కశ్యప' అనే చిత్రాన్ని రూపొందించనున్నట్లు గతంలోనే ప్రకటించారు. ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని ఎప్పుడో సెట్స్‌పైకి తీసుకెళ్లాల్సినా.. కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఇంకా పట్టాలెక్కలేదు.

లాక్‌డౌన్‌ కారణంగా అన్ని చిత్రాల ప్రణాళికలూ తారుమారయ్యాయి. నటీనటుల డేట్స్‌ కుదరకపోవడం వల్ల దర్శకులు ఆ ప్రాజెక్టును పక్కనపెట్టి మరో సినిమా తెరకెక్కించే సందర్భాలను సినీపరిశ్రమలో చూస్తూనే ఉన్నాం. గుణశేఖర్‌ కూడా ఇదే అనుసరిస్తున్నారు. 'హిరణ్య కశ్యప' చిత్రీకరణకు మరింత సమయం ఉండటం వల్ల ఈ గ్యాప్‌లో మరో చిత్రం ప్రకటించారు గుణశేఖర్​. తాజాగా టైటిల్‌ ఖరారు చేసి, మోషన్‌ పోస్టర్‌ వీడియో పంచుకున్నారు. ఇతిహాస ప్రేమకథతో కూడిన ఈ చిత్రానికి 'శాకుంతలం' అనే టైటిల్​ను ఖరారు చేశారు.

  • వెండితెరపై 'హిరణ్యకశ్యప'లో నరసింహావతారాన్ని సాక్షాత్కరింపజేసే ముందు ...
    భారతాన ఆదిపర్వంలోని ఆహ్లాదకర ప్రేమకథని ఆవిష్కరిస్తూ...🙏

    — Gunasekhar (@Gunasekhar1) October 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"హిరణ్య కశ్యప'గా వెండితెరపై నరసింహ అవతారాన్ని చూపించడానికి ముందు మహాభారతం ఆదిపర్వంలోని ప్రేమకథను చూపిస్తున్నాం" అని గుణశేఖర్‌ ట్వీట్​ చేశారు. ఈ చిత్రానికి నిర్మాతగా గుణ నీలిమ వ్యవహరిస్తుండగా.. మణిశర్మ సంగీతాన్ని అందించనున్నారు. ఇందులోని తారాగణం వివరాలు తెలియాల్సిఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.