ETV Bharat / sitara

నిజాయతీగా చెప్తున్నా.. కొన్నేళ్లుగా ఫ్లాప్‌లు అందుకే

author img

By

Published : Dec 18, 2019, 5:42 AM IST

వరుసగా విఫలమవుతూ బాక్సాఫీస్ పోరులో వెనకబడుతున్నాడు బాలీవుడ్ బాద్​షా షారుఖ్ ఖాన్. 2013లో వచ్చిన చెన్నై ఎక్స్​ప్రెస్​ తర్వాత మరో విజయాన్ని ఖాతాలో వేసుకోలేకపోయాడు. తాజాగా ఈ విషయంపై స్పందించిన షారుఖ్ ఫ్లాపులకు గల కారణాలను తెలిపాడు.

shah rukh
షారుఖ్

"కొన్నేళ్లుగా కథలను సరిగ్గా చెప్పడంలో నేను విఫలమవుతున్నా. ఫలితంగానే వరుస పరాజయాలను ఎదుర్కోవల్సి వస్తోంది. నేనిది ఎంతో నిజాయతీగా అంగీకరిస్తున్న, చెప్తున్న మాట" అంటున్నాడు బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు షారుఖ్‌ ఖాన్‌. 2013లో 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌'తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాక ఇంతవరకు బాద్​షా ఆ స్థాయిలో మరో హిట్‌ను దక్కించుకోలేక పోయాడు. ఈ క్రమంలో అరడజనుకు పైగా ఫ్లాప్‌లను ఖాతాలో వేసుకున్నాడు. ఇక గతేడాది ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన 'జీరో' షారుఖ్‌కి దిమ్మతిరిగిపోయే షాకే ఇచ్చింది. ఈ చిత్ర ఫలితంతో పునరాలోచనలో పడ్డ ఈ హీరో ప్రస్తుతం కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.

తాజాగా షారుఖ్‌ తన సినీ కెరీర్‌లో ఎదురవుతున్న వైఫల్యాలకు సంబంధించి ఓ ఆంగ్లమీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. "కథలను అన్నిసార్లు గొప్పగా చెప్పడం సాధ్యపడదు. కాబట్టి పరాజయాలు ఎదుర్కోవల్సి వస్తుంది. భారత్‌లో సినిమాలు తీయడం, క్రికెట్‌ ఆడటం అందరికీ బాగా తెలుసు. వాళ్లు సచిన్‌కు బ్యాటింగ్‌ ఎలా నేర్పుతారో.. నాకు కథ చెప్పడం అలాగే నేర్పుతుంటారు. నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా.. మంచి చిత్రాలు తీయలేదు. ఫలితంగా అవి ఫ్లాప్‌ అయ్యాయి. నిజాయతీగా చెప్తున్న మాటిది. ప్రేక్షకులే నాకు బాస్‌. నేను వాళ్ల ఉద్యోగిని. వాళ్లని సంతృప్తి పరచలేనప్పుడు నా ఉద్యోగం ఊడిపోతుందని నాకు తెలుసు. రెండేళ్లుగా నేనిదే పరిస్థితిని ఎదుర్కొంటున్నా. కానీ, నేను మళ్లీ వస్తా. నా బాస్‌ను మచ్చిక చేసుకుంటా. వాళ్ల మెప్పు పొందేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా" అని చెప్పుకొచ్చాడు.

'జీరో' తర్వాత ఇంతవరకూ షారుఖ్‌ నుంచి కొత్త చిత్ర ప్రకటనేదీ రాలేదు. అట్లీ దర్శకత్వంలో ఇతడు ఓ చిత్రం చేయబోతున్నట్లు వార్తలొచ్చినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. మరి కొత్త ఏడాదిలోనైనా ఈ హీరో నుంచి కొత్త కబురు వినిపిస్తుందేమో వేచి చూడాలి. ప్రస్తుతం షారుఖ్ నిర్మాతగా అభిషేక్‌ బచ్చన్‌తో 'బాబ్‌ బిస్వాస్‌' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

ఇవీ చూడండి.. 'గల్లీబాయ్‌'పై మరోసారి కంగనా సోదరి విమర్శలు

"కొన్నేళ్లుగా కథలను సరిగ్గా చెప్పడంలో నేను విఫలమవుతున్నా. ఫలితంగానే వరుస పరాజయాలను ఎదుర్కోవల్సి వస్తోంది. నేనిది ఎంతో నిజాయతీగా అంగీకరిస్తున్న, చెప్తున్న మాట" అంటున్నాడు బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు షారుఖ్‌ ఖాన్‌. 2013లో 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌'తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాక ఇంతవరకు బాద్​షా ఆ స్థాయిలో మరో హిట్‌ను దక్కించుకోలేక పోయాడు. ఈ క్రమంలో అరడజనుకు పైగా ఫ్లాప్‌లను ఖాతాలో వేసుకున్నాడు. ఇక గతేడాది ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన 'జీరో' షారుఖ్‌కి దిమ్మతిరిగిపోయే షాకే ఇచ్చింది. ఈ చిత్ర ఫలితంతో పునరాలోచనలో పడ్డ ఈ హీరో ప్రస్తుతం కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.

తాజాగా షారుఖ్‌ తన సినీ కెరీర్‌లో ఎదురవుతున్న వైఫల్యాలకు సంబంధించి ఓ ఆంగ్లమీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. "కథలను అన్నిసార్లు గొప్పగా చెప్పడం సాధ్యపడదు. కాబట్టి పరాజయాలు ఎదుర్కోవల్సి వస్తుంది. భారత్‌లో సినిమాలు తీయడం, క్రికెట్‌ ఆడటం అందరికీ బాగా తెలుసు. వాళ్లు సచిన్‌కు బ్యాటింగ్‌ ఎలా నేర్పుతారో.. నాకు కథ చెప్పడం అలాగే నేర్పుతుంటారు. నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా.. మంచి చిత్రాలు తీయలేదు. ఫలితంగా అవి ఫ్లాప్‌ అయ్యాయి. నిజాయతీగా చెప్తున్న మాటిది. ప్రేక్షకులే నాకు బాస్‌. నేను వాళ్ల ఉద్యోగిని. వాళ్లని సంతృప్తి పరచలేనప్పుడు నా ఉద్యోగం ఊడిపోతుందని నాకు తెలుసు. రెండేళ్లుగా నేనిదే పరిస్థితిని ఎదుర్కొంటున్నా. కానీ, నేను మళ్లీ వస్తా. నా బాస్‌ను మచ్చిక చేసుకుంటా. వాళ్ల మెప్పు పొందేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా" అని చెప్పుకొచ్చాడు.

'జీరో' తర్వాత ఇంతవరకూ షారుఖ్‌ నుంచి కొత్త చిత్ర ప్రకటనేదీ రాలేదు. అట్లీ దర్శకత్వంలో ఇతడు ఓ చిత్రం చేయబోతున్నట్లు వార్తలొచ్చినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. మరి కొత్త ఏడాదిలోనైనా ఈ హీరో నుంచి కొత్త కబురు వినిపిస్తుందేమో వేచి చూడాలి. ప్రస్తుతం షారుఖ్ నిర్మాతగా అభిషేక్‌ బచ్చన్‌తో 'బాబ్‌ బిస్వాస్‌' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

ఇవీ చూడండి.. 'గల్లీబాయ్‌'పై మరోసారి కంగనా సోదరి విమర్శలు

RESTRICTION SUMMARY: NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
SHOTLIST:
SKY - NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
Dover - 17 December 2019
1. Migrants walking off UK Border Force boat
2. Migrants being led onto dockside
3. Migrants being led into container                    
4. UK Border Force boats                               
5. Migrants being led into van                              
STORYLINE
British authorities say they are dealing with a number of small boats carrying migrants headed toward the English coast from the European mainland.
The Home Office said Tuesday that there are “ongoing small boat incidents off the Kent coast" in southern England.
Officials say more details will be provided “once the situation has been resolved.”
Sky News reported that some 60 migrants have been brought ashore to Dover in the early hours of Tuesday in a rescue operation in the English Channel.
There has been a rise in small boat crossings despite the wintry weather.
Officials say 79 migrants including some children were picked up trying to get to England on December 4.
UK officials have warned that migrants risk losing their lives and their childrens' lives by making the dangerous crossing.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.