ETV Bharat / sitara

డ్రగ్స్​ కేసు : మరో నిందితుడు అరెస్ట్​

author img

By

Published : Sep 20, 2020, 5:20 PM IST

శాండల్​వుడ్ డ్రగ్స్ కేసులో మరొకరిని అరెస్టు చేశారు బెంగళూరు పోలీసులు. ఇతడి దగ్గర నుంచి మాదక ద్రవ్యాలు, ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

drug
డ్రగ్స్​ కేసు

కర్ణాటక డ్రగ్స్​ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు అధికారులు. ఆ కేసుకు సంబంధించి శ్రీనివాస్​ సుబ్రమణియన్​ను సెంట్రల్​ క్రైమ్​ బ్రాంచ్, ఆదివారం అరెస్టు చేసింది​. మొత్తంగా ఇప్పటివరకు 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇతడి నుంచి 13 ఎక్ట్సాసీ ట్యాబ్లెట్లు, 100 గ్రాముల గంజాయి, 1.1 గ్రాముల ఎండీఎంఎ, 0.5 గ్రాముల హషీష్ సహ పలురకాల మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కస్డడీలో ఉన్న రవిశంకర్​ ఇచ్చిన సమాచారంతో శ్రీనివాస్​ ఇంట్లో సోదా నిర్వహించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అరెస్టయిన నటి రాగిణి ఇతడి ఇంటికి చాలాసార్లు వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.

కర్ణాటక డ్రగ్స్​ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు అధికారులు. ఆ కేసుకు సంబంధించి శ్రీనివాస్​ సుబ్రమణియన్​ను సెంట్రల్​ క్రైమ్​ బ్రాంచ్, ఆదివారం అరెస్టు చేసింది​. మొత్తంగా ఇప్పటివరకు 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇతడి నుంచి 13 ఎక్ట్సాసీ ట్యాబ్లెట్లు, 100 గ్రాముల గంజాయి, 1.1 గ్రాముల ఎండీఎంఎ, 0.5 గ్రాముల హషీష్ సహ పలురకాల మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కస్డడీలో ఉన్న రవిశంకర్​ ఇచ్చిన సమాచారంతో శ్రీనివాస్​ ఇంట్లో సోదా నిర్వహించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అరెస్టయిన నటి రాగిణి ఇతడి ఇంటికి చాలాసార్లు వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి ఇద్దరు నటులు, మాజీ ఎమ్మెల్యే కుమారుడికి సమన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.