ఏపీలోని విశాఖలో సినీ, రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. విశాలాక్షినగర్లోని రెవెన్యూ పార్కు వద్ద 'రౌడీ బేబీ' చిత్రీకరణ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విశాఖలోనే పూర్తిగా చిత్ర నిర్మాణం జరగనున్న సినిమాగా రౌడీ బేబీ నిలుస్తుందని నిర్మాత కోనా వెంకట్ వెల్లడించారు. కోనా ఫిలిం కార్పొరేషన్, ఎంవీవీ సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు షాట్కు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ క్లాప్ నివ్వగా, జీవీ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. స్థానిక శాసన సభ్యులు చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందించారు.
సందీప్ కిషన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, కరణం ధర్మశ్రీ, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సైతం చిత్రంలో నటించనున్నారు.
ఇదీ చూడండి: 'నిశ్చయ్' పెళ్లికి అందుకే రాలేదు: రేణు దేశాయ్