అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరుపు రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి అవగాహన కల్పించిన ప్రముఖ ర్యాపర్ రోల్ రైడా... మరోసారి తన ప్రత్యేకతను చూపించేందుకు సిద్ధమయ్యాడు. ఇన్నాళ్లు రైతుల కష్టాలు, కన్నీళ్లను చూసి చలించిన అతను.. రైతుకు కోపం వస్తే ఎలా ఉండబోతుందో 'నాగలి' అనే ప్రత్యేక గీతంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.
అమిత్, రోల్ రైడా ప్రధాన పాత్రల్లో నటించిన ఆ పాట ప్రచార చిత్రాన్ని తాజాగా విడుదల చేశారు. నాలుగు నిమిషాల నిడివితో ఉండే ఆ పాటను ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీత సారథ్యంలో అరుపు పాటకు దర్శకత్వం వహించిన హరికాంత్ ఈ పాటను రూపొందించారు. కళా మోషన్ పిక్చర్స్ నిర్మించిన 'నాగలి'ని ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు రోల్ రైడా తెలిపారు.
ఇదీ చూడండి : భాజపా రాష్ట్ర కమిటీని ప్రకటించిన బండి సంజయ్