ETV Bharat / sitara

అదరగొడుతున్న 'రామాయణం' సీరియల్​ వీక్షణలు

లాక్​డౌన్​ సందర్భంగా అపురూపమైన సీరియల్స్​ను మళ్లీ ప్రసారం చేస్తున్నారు. వాటిలో ఒకటైన 'రామాయణం'.. కేవలం నాలుగు షోలకే అదిరిపోయే వీక్షణలు సంపాదించి, రికార్డులు సృష్టిస్తోంది.

author img

By

Published : Apr 3, 2020, 8:35 PM IST

Ramayan garners 170 million viewers in 4 shows
రామాయణం సీరియల్​ నాలుగు షోలకే 170 మిలియన్ వీక్షకులు

లాక్​డౌన్​తో ఇళ్లకే పరిమితమైన ప్రజలు.. దూరదర్శన్​లో మళ్లీ ప్రసారమవుతున్న అపురూప టీవీ సీరియల్స్​ తెగ చూస్తున్నారు. వీటిలో ముఖ్యమైన 'రామాయణం'కు సంబంధించిన వీక్షణలు టాప్ లేపాయి. నాలుగు ఎపిసోడ్లు కలిపి 170 మిలియన్ల మంది చూశారని బ్రాడ్​కాస్ట్​ ఆడియన్స్ రీసెర్చ్​ కౌన్సిల్​(బార్క్) ప్రకటించింది.

"ప్రేక్షకుల కోరిక మేరకు ఈ సీరియల్​ను మళ్లీ ప్రసారం చేయాలని ప్రభుత్వ యంత్రాంగం ఆదేశించింది. అందువల్ల గత శనివారం నుంచి ప్రసారం చేస్తున్నాం. అందర్ని ఆశ్చర్యపరిచేలా 'రామాయణం' ధారావాహిక రికార్డు స్థాయిలో వీక్షణలు దక్కించుకుంది. కొన్నిరోజుల్లో ఇది ఇంకా పెరిగే అవకాశముంది" -- సునీల్​ లుల్లా, బార్క్ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​

గత నెల 28న ప్రారంభమైన ఈ సీరియల్.. మొదటి ఎపిసోడ్​ను 34 మిలియన్ల మంది చూడగా, 3.4 శాతం రేటింగ్​ దక్కించుకుంది. అదే రోజు సాయంత్రం 45 మిలియన్ల​మంది చూడగా 5.2 శాతం రేటింగ్ సొంతం చేసుకుంది. ఆదివారం ఉదయం 40 మిలియన్ల మంది, సాయంత్రం 51 మిలియన్ల మంది ఈ ధారావాహికను చూశారు.

ఇదీ చదవండి: కరోనా వల్ల రణ్​బీర్​-ఆలియా పెళ్లి ప్లాన్ మారింది!

లాక్​డౌన్​తో ఇళ్లకే పరిమితమైన ప్రజలు.. దూరదర్శన్​లో మళ్లీ ప్రసారమవుతున్న అపురూప టీవీ సీరియల్స్​ తెగ చూస్తున్నారు. వీటిలో ముఖ్యమైన 'రామాయణం'కు సంబంధించిన వీక్షణలు టాప్ లేపాయి. నాలుగు ఎపిసోడ్లు కలిపి 170 మిలియన్ల మంది చూశారని బ్రాడ్​కాస్ట్​ ఆడియన్స్ రీసెర్చ్​ కౌన్సిల్​(బార్క్) ప్రకటించింది.

"ప్రేక్షకుల కోరిక మేరకు ఈ సీరియల్​ను మళ్లీ ప్రసారం చేయాలని ప్రభుత్వ యంత్రాంగం ఆదేశించింది. అందువల్ల గత శనివారం నుంచి ప్రసారం చేస్తున్నాం. అందర్ని ఆశ్చర్యపరిచేలా 'రామాయణం' ధారావాహిక రికార్డు స్థాయిలో వీక్షణలు దక్కించుకుంది. కొన్నిరోజుల్లో ఇది ఇంకా పెరిగే అవకాశముంది" -- సునీల్​ లుల్లా, బార్క్ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​

గత నెల 28న ప్రారంభమైన ఈ సీరియల్.. మొదటి ఎపిసోడ్​ను 34 మిలియన్ల మంది చూడగా, 3.4 శాతం రేటింగ్​ దక్కించుకుంది. అదే రోజు సాయంత్రం 45 మిలియన్ల​మంది చూడగా 5.2 శాతం రేటింగ్ సొంతం చేసుకుంది. ఆదివారం ఉదయం 40 మిలియన్ల మంది, సాయంత్రం 51 మిలియన్ల మంది ఈ ధారావాహికను చూశారు.

ఇదీ చదవండి: కరోనా వల్ల రణ్​బీర్​-ఆలియా పెళ్లి ప్లాన్ మారింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.