పూరీ కనెక్ట్స్(పీసీ) బ్యానర్పై తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్' సూపర్ హిట్ అయింది. వాణిజ్యపరంగానూ మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు పూరీ, ఛార్మి. ఈ ఆనందంలో రెండు కార్లను కొనుగోలు చేశారు. రేంజ్ రోవర్ వోగ్ను పూరీ, బీఎమ్డబ్ల్యూ-7 సిరీస్ను ఛార్మి తీసుకున్నారు. ఈ రెండూ ఒకేసారి ఇంటికి వచ్చిన ఆనందంలో ఫొటోలు దిగి అభిమానులతో పంచుకున్నారు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు పూరీ జగన్నాథ్. ఈ సినిమానూ వీరిద్దరే సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇదీ చూడండి: 'సత్యాగ్రహి' అందుకే చేయలేదు: పవన్