హీరో ప్రభాస్-'కేజీఎఫ్' ఫేం ప్రశాంత్ నీల్ కాంబోలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా 'సలార్'. తాజాగా ఈ చిత్రం గురించి ఓ వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇందులో డార్లింగ్.. ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలిసింది. అందులో ఒకటి ఆర్మీ ఆఫీసర్గా కనిపించనున్నారట. మరొక పాత్ర ఏమిటనేది స్పష్టత లేదు. ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కించే సన్నివేశాలు సినిమాకే హైలెట్గా ఉండనున్నాయట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన లేదా సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.
పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయిక. ప్రస్తుతం కరోనా కారణంగా చిత్రీకరణకు తాత్కాలికంగా వాయిదా పడింది.
ఇదీ చూడండి: ప్రభాస్.. 'సలార్', 'ఆదిపురుష్' కోసం ఒకేసారి!