కరోనా రావడం వల్ల ప్రపంచమంతా అల్లకల్లోలమైనా సరే కొన్ని మంచి పనులు కూడా జరిగాయని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది. కుటుంబం అనేది మనకు ఎంత ముఖ్యమో ప్రస్తుత పరిస్థితుల వల్ల తెలిసిందని ఆమె తెలిపింది.
ఈమె హీరోయిన్గా నటించిన 'సర్దార్ కి గ్రాండ్సన్'.. నెట్ఫ్లిక్స్లో మంగళవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్యూలో మాట్లాడిన రకుల్ పలు ఆసక్తికర విషయాల్ని పంచుకుంది. అమెరికా వచ్చిన మనవడు, తన బామ్మ చివరి కోరిక తీర్చడం అనే కుటుంబ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
"ఇది బామ్మ, మనవడి కథ కాదు. కుటుంబం అనేది ఎంత ముఖ్యమో కూడా చెబుతుంది. గత సంవత్సరం నుంచి తప్ప ఫ్యామిలీ ప్రాముఖ్యాన్ని తెలుసుకోలేకపోయాను" అని రకుల్ పేర్కొంది.
ఈ సినిమాలో అర్జున్ కపూర్ హీరోగా,రకుల్ హీరోయిన్గా చేశారు. జాన్ అబ్రహం, అదితీ రావ్ హైదరీ తదితరులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. కాశ్వీ నాయర్ దర్శకత్వం వహించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">