ప్రతిష్ఠాత్మక ఆస్కార్ పురస్కారాల కోసం భారత్ నుంచి 'షేమ్లెస్' అనే ఓ లఘుచిత్రం నామినేట్ అయింది. లైవ్ యాక్షన్ కేటగిరీలో ఇది పోటీపడుతోంది. అకాడమీ అవార్డుల రేసులో నిలిచినందుకు ఈ సినిమా దర్శకుడు కేయిత్ గోమ్స్ హర్షం వ్యక్తం చేశాడు. తన చిత్ర బృందానికి కృతజ్ఞతలు చెప్పాడు.
"ఈ ప్రత్యేక సందర్భంలో నా సినిమా నటీనటులకు, సిబ్బందికి నేను ధన్యవాదాలు చెప్పాలి. నా కుటుంబం, స్నేహితులు చేసిన ధనసాయంతో నేను సినిమాలు తీస్తుంటాను. వాళ్లంతా ప్రేమ, ఆసక్తితో నాతో కలిసి వస్తారు. అంతకంటే మరింత ఆశీర్వాదం ఇంకేం లేదు."
--కేయిత్ గోమ్స్, 'షేమ్లెస్' లఘుచిత్ర దర్శకుడు
భారత్నుంచి నట్ఖట్, సౌండ్ ప్రూఫ్, సఫర్, ట్రాప్డ్ అనే నాలుగు లఘు చిత్రాలతో పోటీ పడి.. ఆస్కార్కు అర్హత సాధించింది షేమ్లెస్. 15 నిమిషాల నిడివి గల ఈ కామెడీ థ్రిల్లర్ సినిమాలో.. సాయని గుప్తా, హుస్సేన్ దలాల్, రిషభ్ కపూర్ తదితరులు నటించారు.
ఇటీవల ముగిసిన 3వ 'బెస్ట్ ఆఫ్ ఇండియా షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ 2020'లో 'షేమ్లెస్' లఘుచిత్రం విజేతగా నిలిచింది.
ఇదీ చూడండి:ఆస్కార్కు వెళ్లిన సినిమాలు ఏవో తెలుసా?