'ఆది' సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఎన్టీఆర్కు గాయమైందని 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో దర్శకుడు వి.వి.వినాయక్ చెప్పారు. సన్నివేశాన్ని చిత్రీకరించే క్రమంలో తారక్ మణికట్టుకు గాయమైందని.. ఆ బాధతో ఎన్టీఆర్ విలవిలలాడినట్లు వెల్లడించారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఉత్సాహంగా షూటింగ్లో పాల్గొన్నాడని తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"ఎన్టీఆర్కు గాయమవ్వగానే ముందు భయపడిపోయా. చేతి నుంచి రక్తం బాగా పోతుంది. 17 ఏళ్ల కుర్రాడు కదా.. గాయం నొప్పికి బాగా ఏడ్చేస్తున్నాడు. ఆ సమయంలో ఏం చేయాలో మాకందరికి తోచలేదు. దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్తే అక్కడున్న డాక్టర్ మమ్మల్ని మరింత భయపెట్టేశాడు. చేతి మణికట్టు దగ్గర మృదువైన నరం ఉంటుందని.. దాన్ని ఏమి చేయలేక వైజాగ్లోని ఆస్పత్రికి వెళ్లమని ఆ వైద్యుడు సూచించాడు. రక్తస్రావం కాకుండా గట్టిగా కట్టు కట్టాం. తారక్ వాళ్ల అమ్మకు ఫోన్ చేసి 'మమ్మీ.. మమ్మీ' అని ఏడ్చేస్తున్నాడు. వైజాగ్ చేరుకుని ట్రీట్మెంట్ చేయించాం. ఆ గాయం తగ్గాక ఆ సన్నివేశాన్ని పూర్తి చేద్దామని తారక్ చెప్పాడు. ఇక రాత్రి షూటింగ్ పెట్టి ఒంటి చేత్తో ఫైట్ చేసే సన్నివేశాన్ని చిత్రీకరించాం" అని వినాయక్ చెప్పారు.