ETV Bharat / sitara

నితిన్ కొత్త సినిమా టైటిల్​ తెలుసా?

యంగ్​ హీరో నితిన్​ జోరు పెంచాడు. వరుసగా చిత్రాలను పట్టాలెక్కిస్తున్నాడు. తాజాగా నితిన్‌ 29వ చిత్రానికి టైటిల్‌ ఖరారైంది. సినిమాకు ‘రంగ్‌దే’ అనే పేరును ఖరారు చేశారు. ‘గివ్‌ మీ సమ్‌ లవ్‌’ అనేది ఉపశీర్షిక.

author img

By

Published : Jun 24, 2019, 12:23 PM IST

నితిన్ కొత్త సినిమా టైటిల్​ తెలుసా?

యువ కథానాయకుడు నితిన్ బిజిబిజీగా ఉన్నాడు. తన 29వ చిత్రానికి 'రంగ్​దే' అనే పేరు ఖరారైంది. ఈ మధ్య పాటల లిరిక్స్‌ను టైటిల్‌గా పెడుతున్న సినిమాలు ఎక్కువగానే వచ్చాయి. ముఖ్యంగా ​సినిమా పాటల్లోని లిరిక్స్​నే చిత్ర టైటిళ్లుగా వాడుతున్నాడు ఈ లవర్​బాయ్.

గతంలో నితిన్‌ నటించిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ (గబ్బర్‌ సింగ్‌లోని ‘దిల్‌ సే’ పాటలోని లిరిక్‌), ‘చిన్నదాన నీకోసం’ ( ‘ఇష్క్‌’ సినిమాలోని ‘చిన్నదాన నీకోసం’ లిరిక్‌). ఇప్పుడు నితిన్‌ నటించనున్న ‘రంగ్‌ దే’ కూడా ‘అ ఆ’ సినిమాలోని ‘రంగ్‌ దే రే..’ పాటలోని లిరిక్‌. 2020లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

'తొలిప్రేమ' చిత్రంతో మంచి విజయాన్ని అందుకొన్న వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఇందులో నితిన్‌కు జోడీగా కీర్తి సురేశ్‌ నటిస్తుంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్‌ ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించనున్నారు.

ఇదీ చూడండి: రకుల్​, ప్రియా వారియర్ మధ్యలో నితిన్!

యువ కథానాయకుడు నితిన్ బిజిబిజీగా ఉన్నాడు. తన 29వ చిత్రానికి 'రంగ్​దే' అనే పేరు ఖరారైంది. ఈ మధ్య పాటల లిరిక్స్‌ను టైటిల్‌గా పెడుతున్న సినిమాలు ఎక్కువగానే వచ్చాయి. ముఖ్యంగా ​సినిమా పాటల్లోని లిరిక్స్​నే చిత్ర టైటిళ్లుగా వాడుతున్నాడు ఈ లవర్​బాయ్.

గతంలో నితిన్‌ నటించిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ (గబ్బర్‌ సింగ్‌లోని ‘దిల్‌ సే’ పాటలోని లిరిక్‌), ‘చిన్నదాన నీకోసం’ ( ‘ఇష్క్‌’ సినిమాలోని ‘చిన్నదాన నీకోసం’ లిరిక్‌). ఇప్పుడు నితిన్‌ నటించనున్న ‘రంగ్‌ దే’ కూడా ‘అ ఆ’ సినిమాలోని ‘రంగ్‌ దే రే..’ పాటలోని లిరిక్‌. 2020లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

'తొలిప్రేమ' చిత్రంతో మంచి విజయాన్ని అందుకొన్న వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఇందులో నితిన్‌కు జోడీగా కీర్తి సురేశ్‌ నటిస్తుంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్‌ ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించనున్నారు.

ఇదీ చూడండి: రకుల్​, ప్రియా వారియర్ మధ్యలో నితిన్!

New Delhi, Jun 24 (ANI): Rashtriya Janata Dal (RJD) leader Manoj Jha spoke over deaths of children in Muzaffarpur and even spoke about the whereabouts of ex-deputy chief minister of Bihar, Tejashwi Yadav. While speaking to ANI, Jha said, "I have moved a Calling Attention motion in Rajya Sabha over deaths of children in Muzaffarpur". On Tejashwi Yadav, he said if he stands in front of SKMCH, media personnel will say that we are doing politics on the issue.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.