ETV Bharat / sitara

సల్మాన్​ఖాన్​కు కోర్టు నుంచి పిలుపు

author img

By

Published : Jan 17, 2021, 6:58 AM IST

కృష్ణ జింకల వేట కేసులో ఫిబ్రవరి 6న జరిగే విచారణకు హాజరు కావాలని బాలీవుడ్​ నటుడు సల్మాన్​ఖాన్​ను జోధ్​పూర్​ జిల్లా సెషన్స్​ కోర్టు ఆదేశించింది. గతంలో వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇచ్చినా.. ఈ సారి విచారణకు హాజరు కావాల్సిందేనని న్యాయస్థానం వెల్లడించింది.

Next hearing on February 6 in Salman Khan blackbuck poaching case
సల్మాన్​ఖాన్​కు కోర్టు నుంచి పిలుపు

కృష్ణ జింకల వేట కేసులో వచ్చే నెల 6న జరిగే విచారణకు హాజరు కావాలని ప్రముఖ బాలీవుడ్​ నటుడు సల్మాన్​ఖాన్​ను జోధ్​పూర్​ జిల్లా సెషన్స్​ కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఆయనను ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కింది కోర్టు తీర్పు ఇవ్వగా.. ఖాన్​ దాన్ని సెషన్స్​ కోర్టులో సవాలు చేశారు. దీనిపై శనివారం చేపట్టిన విచారణకు ఆయన హాజరు కాలేకపోయారు.

కరోనా పరిస్థితుల కారణంగా ఖాన్​ విచారణకు హాజరు కాలేరని ఆయన తరపు న్యాయవాది నిశాంత్​ బోరా మినహాయింపు కోరగా.. సెషన్స్​ న్యాయమూర్తి దేవేంద్ర కచ్వాహ అందుకు అంగీకరించారు. అయితే, ఫిబ్రవరి 6న జరిగే విచారణకు హాజరు కావాలని సల్మాన్​ ఖాన్​ను ఆదేశించారు.

మాట్లాడుతున్న న్యాయవాదులు

ఏం జరిగిందంటే?

ఓ సినిమా చిత్రీకరణ సందర్భంగా జోధ్​పూర్​ వచ్చిన సల్మాన్​ఖాన్​, మరికొందరు.. 1998, అక్టోబరు 1-2 తేదీల్లో స్థానిక కృష్ణ జింకలను వేటాడినట్టు కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన దిగువ కోర్టు, 2018 మార్చిలో తీర్పు వెలువరించింది. ఈ కేసులో సల్మాన్​ దోషిగా నిర్ధారించింది.

ఇదీ చూడండి: కత్తితో కేక్ కటింగ్.. విజయ్ సేతుపతి​ క్షమాపణలు

కృష్ణ జింకల వేట కేసులో వచ్చే నెల 6న జరిగే విచారణకు హాజరు కావాలని ప్రముఖ బాలీవుడ్​ నటుడు సల్మాన్​ఖాన్​ను జోధ్​పూర్​ జిల్లా సెషన్స్​ కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఆయనను ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కింది కోర్టు తీర్పు ఇవ్వగా.. ఖాన్​ దాన్ని సెషన్స్​ కోర్టులో సవాలు చేశారు. దీనిపై శనివారం చేపట్టిన విచారణకు ఆయన హాజరు కాలేకపోయారు.

కరోనా పరిస్థితుల కారణంగా ఖాన్​ విచారణకు హాజరు కాలేరని ఆయన తరపు న్యాయవాది నిశాంత్​ బోరా మినహాయింపు కోరగా.. సెషన్స్​ న్యాయమూర్తి దేవేంద్ర కచ్వాహ అందుకు అంగీకరించారు. అయితే, ఫిబ్రవరి 6న జరిగే విచారణకు హాజరు కావాలని సల్మాన్​ ఖాన్​ను ఆదేశించారు.

మాట్లాడుతున్న న్యాయవాదులు

ఏం జరిగిందంటే?

ఓ సినిమా చిత్రీకరణ సందర్భంగా జోధ్​పూర్​ వచ్చిన సల్మాన్​ఖాన్​, మరికొందరు.. 1998, అక్టోబరు 1-2 తేదీల్లో స్థానిక కృష్ణ జింకలను వేటాడినట్టు కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన దిగువ కోర్టు, 2018 మార్చిలో తీర్పు వెలువరించింది. ఈ కేసులో సల్మాన్​ దోషిగా నిర్ధారించింది.

ఇదీ చూడండి: కత్తితో కేక్ కటింగ్.. విజయ్ సేతుపతి​ క్షమాపణలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.