బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతి కేసులో భాగంగా మాదక ద్రవ్యాల విషయమై హీరోయిన్ దీపికా పదుకొణె మేనేజర్ కరిష్మా ప్రకాశ్కు మరోసారి సమన్లు జారీ చేసింది నార్కోట్రిక్స్ కంట్రోల్ బ్యూరో. మంగళవారం ఆమె ఇంటిపై సోదాలు నిర్వహించిన ఎన్సీబీ.. డ్రగ్స్ను స్వాధీనం చేసుకుంది. అయితే ఎంత పరిమాణంలో పట్టుబడ్డాయో స్పష్టత లేదు. కాగా ప్రస్తుతం కరీష్మా పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం విచారణకు హాజరుకావల్సిందిగా సమన్లు జారీ చేశారు అధికారులు.
ఇటీవల కరిష్మాను ఓ సారి విచారించింది నార్కోట్రిక్స్ కంట్రోల్ బ్యూరో. ఆమెతో పాటు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, దీపికా పదుకొణె, శ్రద్ధాకపూర్ను విచారించింది.
ఇదీ చూడండి 'విజయ్ కుమార్తె గురించి అసభ్యంగా మాట్లాడింది నేనే'