ETV Bharat / sitara

నాని 'వి' ఇంటికి వచ్చేది ఆరోజే!

author img

By

Published : Aug 20, 2020, 1:41 PM IST

నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'వి' చిత్రం విడుదల ఖరారైంది. ఎట్టకేలకు ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు నాని. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు.

నాని 'వి' ఇంటికి వచ్చేది ఆరోజే!
నాని 'వి' ఇంటికి వచ్చేది ఆరోజే!

కరోనా కారణంగా చిత్రీకరణలు, సినిమా విడుదలలు వాయిదా పడ్డాయి. దీంతో నిర్మాతలు నష్టాల బారిన పడుతున్నారు. కొంత మంది ఓటీటీల వైపు మొగ్గు చూపుతుండగా.. మరికొందరు మాత్రం థియేటర్లలోనే విడుదల చేస్తామని అంటున్నారు. నాని కెరీర్​లో 25వ చిత్రంగా ప్రత్యేకంగా నిలిచిపోయే 'వి' సినిమాను కూడా థియేటర్లలోనే విడుదల చేస్తామని చాలాసార్లు స్పష్టం చేసింది చిత్రబృందం. అయితే వారి ప్రణాళికలు అన్నీ తారుమారయ్యాయి. దీంతో ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశాడు నాని. సెప్టెంబర్ 5న అమెజాన్​ ప్రైమ్​లో విడుదల చేయనున్నట్లు వెల్లడించాడు.

ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కావాల్సిన 'వి'.. లాక్​డౌన్​ కారణంగా వాయిదా పడింది. వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్న కారణంగా థియేటర్లను ఇప్పట్లో తెరిచేలా కనిపించడం లేదు. అందుకే చిత్రబృందం ఓటీటీ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో నాని ప్రతినాయకుడిగా కనిపించనుండగా, సుధీర్​బాబు పోలీస్​గా అలరించనున్నాడు. నివేదా థామస్, అదితీ రావ్ హైదరీ హీరోయిన్లు. మోహన్​కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. దిల్​రాజు నిర్మాత.

కరోనా కారణంగా చిత్రీకరణలు, సినిమా విడుదలలు వాయిదా పడ్డాయి. దీంతో నిర్మాతలు నష్టాల బారిన పడుతున్నారు. కొంత మంది ఓటీటీల వైపు మొగ్గు చూపుతుండగా.. మరికొందరు మాత్రం థియేటర్లలోనే విడుదల చేస్తామని అంటున్నారు. నాని కెరీర్​లో 25వ చిత్రంగా ప్రత్యేకంగా నిలిచిపోయే 'వి' సినిమాను కూడా థియేటర్లలోనే విడుదల చేస్తామని చాలాసార్లు స్పష్టం చేసింది చిత్రబృందం. అయితే వారి ప్రణాళికలు అన్నీ తారుమారయ్యాయి. దీంతో ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశాడు నాని. సెప్టెంబర్ 5న అమెజాన్​ ప్రైమ్​లో విడుదల చేయనున్నట్లు వెల్లడించాడు.

ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కావాల్సిన 'వి'.. లాక్​డౌన్​ కారణంగా వాయిదా పడింది. వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్న కారణంగా థియేటర్లను ఇప్పట్లో తెరిచేలా కనిపించడం లేదు. అందుకే చిత్రబృందం ఓటీటీ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో నాని ప్రతినాయకుడిగా కనిపించనుండగా, సుధీర్​బాబు పోలీస్​గా అలరించనున్నాడు. నివేదా థామస్, అదితీ రావ్ హైదరీ హీరోయిన్లు. మోహన్​కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. దిల్​రాజు నిర్మాత.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.