కరోనా లాక్డౌన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం బుధవారం మరోసారి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతినిచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. అయితే ఇప్పటివరకు 50 శాతం సీటింగ్కే పరిమితమున్న థియేటర్ల సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని వెల్లడించింది.
ఇటీవల సంక్రాంతి సీజన్కు ముందు థియేటర్ల సామర్థ్యాన్ని 100 శాతానికి పెంచుతున్నట్లు తమిళనాడు, పశ్చిమ బంగాల్ ప్రభుత్వాలు ప్రకటించాయి. కానీ ఈ నిర్ణయానికి కేంద్రం అడ్డు చెప్పడం వల్ల మళ్లీ వెనక్కు తగ్గాల్సి వచ్చింది. తాజాగా కేంద్రమే థియేటర్ల సామర్థ్యం పెంపుపై నిర్ణయం తీసుకోవడం వల్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.