ETV Bharat / sitara

ఇకపై థియేటర్లు హౌస్​ఫుల్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

author img

By

Published : Jan 28, 2021, 9:49 AM IST

కరోనా లాక్​డౌన్ తర్వాత ప్రస్తుతం 50 శాతం సీటింగ్ పరిమితితో థియేటర్లు నడుస్తున్నాయి. అయితే తాజాగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం.. థియేటర్ల సీటింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని వెల్లడించింది.

Theatre
ఇకపై థియేటర్లు హౌస్​ఫుల్

కరోనా లాక్​డౌన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం బుధవారం మరోసారి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతినిచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. అయితే ఇప్పటివరకు 50 శాతం సీటింగ్​కే పరిమితమున్న థియేటర్ల సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని వెల్లడించింది.

ఇటీవల సంక్రాంతి సీజన్​కు ముందు థియేటర్ల సామర్థ్యాన్ని 100 శాతానికి పెంచుతున్నట్లు తమిళనాడు, పశ్చిమ బంగాల్ ప్రభుత్వాలు ప్రకటించాయి. కానీ ఈ నిర్ణయానికి కేంద్రం అడ్డు చెప్పడం వల్ల మళ్లీ వెనక్కు తగ్గాల్సి వచ్చింది. తాజాగా కేంద్రమే థియేటర్ల సామర్థ్యం పెంపుపై నిర్ణయం తీసుకోవడం వల్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కరోనా లాక్​డౌన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం బుధవారం మరోసారి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతినిచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. అయితే ఇప్పటివరకు 50 శాతం సీటింగ్​కే పరిమితమున్న థియేటర్ల సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని వెల్లడించింది.

ఇటీవల సంక్రాంతి సీజన్​కు ముందు థియేటర్ల సామర్థ్యాన్ని 100 శాతానికి పెంచుతున్నట్లు తమిళనాడు, పశ్చిమ బంగాల్ ప్రభుత్వాలు ప్రకటించాయి. కానీ ఈ నిర్ణయానికి కేంద్రం అడ్డు చెప్పడం వల్ల మళ్లీ వెనక్కు తగ్గాల్సి వచ్చింది. తాజాగా కేంద్రమే థియేటర్ల సామర్థ్యం పెంపుపై నిర్ణయం తీసుకోవడం వల్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.