ETV Bharat / sitara

మెగాస్టార్ చిరంజీవి కోసం ప్రత్యేక షో!

author img

By

Published : Jun 4, 2020, 7:07 PM IST

మెగాస్టార్ చిరుకు కోసం 'ఉప్పెన' సినిమా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఈ చిత్రంతో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు.

chiranjeevi
చిరంజీవి

'నీ కన్ను నీలి సముద్రం' పాటతో విడుదలకు ముందే క్రేజ్ తెచ్చుకుంది 'ఉప్పెన'. సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్​తేజ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. అయితే ఏప్రిల్​లో రావాల్సిన ఈ సినిమా... కరోనా వల్ల ఆగిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు తెరిచేలా కనిపించడం లేదు. అయితే 'ఉప్పెన' చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి చిత్రబృందానికి చెప్పారట. దీంతో ఆయన కోసం ప్రత్యేక ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తోంది మైత్రీ మూవీ మేకర్స్.

ఇందులో హీరోయిన్​గా కృతిశెట్టి నటించింది. విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. గ్రామీణ నేపథ్య కథతో రూపొందించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.

'నీ కన్ను నీలి సముద్రం' పాటతో విడుదలకు ముందే క్రేజ్ తెచ్చుకుంది 'ఉప్పెన'. సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్​తేజ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. అయితే ఏప్రిల్​లో రావాల్సిన ఈ సినిమా... కరోనా వల్ల ఆగిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు తెరిచేలా కనిపించడం లేదు. అయితే 'ఉప్పెన' చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి చిత్రబృందానికి చెప్పారట. దీంతో ఆయన కోసం ప్రత్యేక ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తోంది మైత్రీ మూవీ మేకర్స్.

ఇందులో హీరోయిన్​గా కృతిశెట్టి నటించింది. విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. గ్రామీణ నేపథ్య కథతో రూపొందించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.

ఇదీ చూడండి : 'నిశ్శబ్దం'గా సినిమా చూసిన పూరీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.