మలయాళ ప్రముఖ నటుడు రిజబవా(55) సోమవారం తుదిశ్వాస విడిచారు. గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన.. కోచిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు.
ఆయన మృతిపట్ల మలయాళ స్టార్స్ దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు సంతాపం తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయనకు నివాళులర్పిస్తున్నారు.
![Malayalam actor Rizabawa dies at 55](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13055152_rizabawa-2.jpg)
కెరీర్ ప్రారంభంలో హాస్యభరిత పాత్రలతో ఆకట్టుకున్న రిజబవా.. 90ల్లో ప్రతినాయకుడిగా ఎన్నో సినిమాలు చేశారు.
1984లో 'విష్ణుపక్షి'తో చిత్రసీమలోకి అడుగుపెట్టినప్పటికీ, ఆ సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత ఆరేళ్లకు 'డాక్టర్ పశుపతి' చిత్రంలో నటించి, మెప్పించి అందరి దృష్టి తనవైపు తిప్పుకోగలిగారు.
ఇవీ చదవండి: