ETV Bharat / sitara

'సలార్​' విలన్​ ఫిక్స్.. సోషల్​మీడియాలో పోస్టు​!

author img

By

Published : Feb 7, 2021, 2:25 PM IST

రెబల్​స్టార్​ ప్రభాస్​, దర్శకుడు ప్రశాంత్​ నీల్​ కాంబినేషన్​లో రూపొందుతోన్న 'సలార్​' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో కన్నడ నటుడు మధూ గురుస్వామి విలన్​గా ఎంపికయ్యారని ప్రచారం సాగుతోంది. ఇదే విషయమే సదరు నటుడు సోషల్​మీడియాలో పోస్ట్​ పెట్టడం వల్ల ఆ ఊహాగానాలు నిజమే కావొచ్చని చిత్రసీమ వర్గాలు అంటున్నాయి.

Madhu Guruswamy is the villain in Prabhas and Prashanth neel's Salaar
'సలార్​' విలన్​ ఫిక్స్.. సోషల్​మీడియాలో పోస్టు​!

పాన్‌ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'సలార్‌'. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌ గోదావరి ఖనిలోని బొగ్గుగనిలో జరుగుతోంది. అయితే, ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఎవరు నటించనున్నారనే విషయంలో గత కొన్నిరోజులుగా పలువురు నటుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాను 'సలార్‌'లో నటిస్తున్నానని పేర్కొంటూ కన్నడ నటుడు మధూ గురుస్వామి సోషల్‌మీడియాలో ఇటీవల పోస్ట్‌ పెట్టారు.

"నా తదుపరి ప్రాజెక్ట్‌ 'సలార్‌'. నాకెంతో ఆనందాన్ని అందిస్తున్న ఈ విషయం గురించి మీతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. 'సలార్‌' వంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఆనందిస్తున్నాను. నాకు ఇలాంటి సువర్ణ అవకాశాన్ని అందించిన దర్శకుడు ప్రశాంత్‌నీల్, నిర్మాత, నిర్మాణ సంస్థలకు ధన్యవాదాలు"

- మధూ గురుస్వామి, కన్నడ నటుడు

ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీంతో మధూ గురుస్వామి.. 'సలార్‌'లో విలన్‌గా కనిపించనున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. శ్రుతిహాసన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన షెడ్యూల్‌లో ప్రభాస్‌-శ్రుతిహాసన్‌లకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇదీ చూడండి: 'సుకుమార్​.. ఒక్క ఛాన్స్​ ఇవ్వండి!'

పాన్‌ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'సలార్‌'. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌ గోదావరి ఖనిలోని బొగ్గుగనిలో జరుగుతోంది. అయితే, ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఎవరు నటించనున్నారనే విషయంలో గత కొన్నిరోజులుగా పలువురు నటుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాను 'సలార్‌'లో నటిస్తున్నానని పేర్కొంటూ కన్నడ నటుడు మధూ గురుస్వామి సోషల్‌మీడియాలో ఇటీవల పోస్ట్‌ పెట్టారు.

"నా తదుపరి ప్రాజెక్ట్‌ 'సలార్‌'. నాకెంతో ఆనందాన్ని అందిస్తున్న ఈ విషయం గురించి మీతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. 'సలార్‌' వంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఆనందిస్తున్నాను. నాకు ఇలాంటి సువర్ణ అవకాశాన్ని అందించిన దర్శకుడు ప్రశాంత్‌నీల్, నిర్మాత, నిర్మాణ సంస్థలకు ధన్యవాదాలు"

- మధూ గురుస్వామి, కన్నడ నటుడు

ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీంతో మధూ గురుస్వామి.. 'సలార్‌'లో విలన్‌గా కనిపించనున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. శ్రుతిహాసన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన షెడ్యూల్‌లో ప్రభాస్‌-శ్రుతిహాసన్‌లకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇదీ చూడండి: 'సుకుమార్​.. ఒక్క ఛాన్స్​ ఇవ్వండి!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.