ETV Bharat / sitara

'మోస్ట్​ ఎలిజిబుల్ బ్యాచ్​లర్​'తో పూజ

author img

By

Published : Sep 18, 2020, 2:21 PM IST

అక్కినేని వారసుడు అఖిల్​ హీరోగా వస్తున్న చిత్రం 'మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్​. లాక్​డౌన్​ అనంతరం సినిమా షూటింగ్​ ప్రారంభమైంది. హీరోయిన్ పూజా హెగ్డేతో పాటు అఖిల్​పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా సెట్​లో తీసుకున్న ఓ ఫొటోను నెట్టింట షేర్ చేసింది పూజ.

Life moves on and it feels great says Pooja Hegde
'మోస్ట్​ ఎలిజిబుల్ బ్యాచ్​లర్​'తో పూజ

కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​తో నిలిచిపోయిన సినిమా షూటింగులు ఒక్కొక్కటిగా పట్టాలెక్కుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు చిత్రీకరణ కూడా పూర్తి చేసుకున్నాయి. ఈ క్రమంలోనే సుదీర్ఘ విరామం అనంతరం అక్కినేని అఖిల్​ హీరోగా తెరకెక్కుతోన్న 'మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్'​ షూటింగ్​ పునఃప్రారంభమైంది. బొమ్మరిల్లు భాస్కర్​ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.

ప్రస్తుతం ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. తాజాగా సెట్​లో అఖిల్​తో ఉన్న ఫొటోను ఇన్​స్టాలో పోస్ట్ చేసింది పూజ. ఇద్దరి జోడీ బాగుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

గీతా ఆర్ట్స్​ పతాకంపై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ స్వరకర్త. ఈ సినిమాతో పాటు పూజ.. ప్రభాస్​ హీరోగా తెరకెక్కుతున్న 'రాధేశ్యామ్​'లోనూ నటిస్తోంది.

కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​తో నిలిచిపోయిన సినిమా షూటింగులు ఒక్కొక్కటిగా పట్టాలెక్కుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు చిత్రీకరణ కూడా పూర్తి చేసుకున్నాయి. ఈ క్రమంలోనే సుదీర్ఘ విరామం అనంతరం అక్కినేని అఖిల్​ హీరోగా తెరకెక్కుతోన్న 'మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్'​ షూటింగ్​ పునఃప్రారంభమైంది. బొమ్మరిల్లు భాస్కర్​ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.

ప్రస్తుతం ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. తాజాగా సెట్​లో అఖిల్​తో ఉన్న ఫొటోను ఇన్​స్టాలో పోస్ట్ చేసింది పూజ. ఇద్దరి జోడీ బాగుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

గీతా ఆర్ట్స్​ పతాకంపై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ స్వరకర్త. ఈ సినిమాతో పాటు పూజ.. ప్రభాస్​ హీరోగా తెరకెక్కుతున్న 'రాధేశ్యామ్​'లోనూ నటిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.