ETV Bharat / sitara

'సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఇలా'

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న 'చావు కబురు చల్లగా' సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభమైంది. ఈ విషయాన్ని లావణ్య త్రిపాఠి తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. 'సుదీర్ఘ నిరీక్షణ తర్వాత చివరకు ఇలా' అని సెట్స్‌లోకి అడుగుపెట్టటం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

author img

By

Published : Oct 23, 2020, 9:16 AM IST

lavanya-tripati-on -her -new- movie
' సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఇలా '

కరోనా - లాక్‌డౌన్‌ పరిస్థితులతో ఆగిన 'చావు కబురు చల్లగా' చిత్రం తాజాగా తిరిగి ప్రారంభమైంది. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకుడు కాగా బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెట్స్‌లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ కొనసాగిస్తున్నట్లు చిత్ర బృందం ఓ వీడియో ద్వారా తెలియజేసింది.

ఇటీవలే 'ఏ1 ఎక్స్‌ప్రెస్' చిత్రీకరణను పూర్తి చేసిన కథానాయిక లావణ్య త్రిపాఠి ఈ సినిమా కోసం సెట్స్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాకి సంబంధించి ఓ వీడియోను షేర్​ చేసింది లావణ్య. ఈ వీడియోలో కార్తికేయ, లావణ్య మాస్క్‌లతో సెట్స్‌లోకి ఎంట్రీ ఇవ్వడం చూపించారు. ఈ వీడియోను లావణ్య ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుత షెడ్యూల్‌లో భాగంగా కార్తికేయ, లావణ్య, మురళీ శర్మ తదితర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

కరోనా - లాక్‌డౌన్‌ పరిస్థితులతో ఆగిన 'చావు కబురు చల్లగా' చిత్రం తాజాగా తిరిగి ప్రారంభమైంది. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకుడు కాగా బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెట్స్‌లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ కొనసాగిస్తున్నట్లు చిత్ర బృందం ఓ వీడియో ద్వారా తెలియజేసింది.

ఇటీవలే 'ఏ1 ఎక్స్‌ప్రెస్' చిత్రీకరణను పూర్తి చేసిన కథానాయిక లావణ్య త్రిపాఠి ఈ సినిమా కోసం సెట్స్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాకి సంబంధించి ఓ వీడియోను షేర్​ చేసింది లావణ్య. ఈ వీడియోలో కార్తికేయ, లావణ్య మాస్క్‌లతో సెట్స్‌లోకి ఎంట్రీ ఇవ్వడం చూపించారు. ఈ వీడియోను లావణ్య ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుత షెడ్యూల్‌లో భాగంగా కార్తికేయ, లావణ్య, మురళీ శర్మ తదితర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.