ETV Bharat / sitara

'కరణ్​, షారుక్.. నా భర్తకు మాయమాటలు చెప్పారు'

author img

By

Published : Jun 25, 2020, 5:54 AM IST

Updated : Jun 25, 2020, 6:04 AM IST

బాలీవుడ్​ పరిశ్రమలో బంధుప్రీతికి తన భర్త కూడా బలైనట్లు దివంగత నటుడు ఇందర్​ కుమార్​ భార్య పల్లవి ఆరోపించారు. షారుక్​ ఖాన్​, కరణ్ జోహార్​ లాంటి సినీ ప్రముఖులు ఇందర్​కు అవకాశాలు ఇస్తామని మాయమాటలు చెప్పినట్లు పేర్కొన్నారు.

Late Inder Kumar's wife accuses Karan Johar, SRK of giving false hope
'కరణ్​, షారుఖ్​లు నా భర్తకు మాయమాటలు చెప్పారు'

సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆత్యహత్యతో బాలీవుడ్​లో బంధుప్రీతి, పక్షపాతం రాజ్యమేలుతోదంటూ సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా దివంగత నటుడు ఇందర్​ కుమార్​ భార్య పల్లవి.. తన భర్త ఇండస్ట్రీలో నెపోటిజం బాధితుడిగా పేర్కొన్నారు. షారుక్​ ఖాన్​, కరణ్​ జోహార్​ లాంటి సినీ ప్రముఖులు ఇందర్​ కెరీర్​పై తీవ్ర ప్రభావం చూపించారంటూ విమర్శించారు. తన భర్త చనిపోవడానికి ముందు సినిమా అవకాశాల కోసం ఎంతో శ్రమించాడని ఇన్​స్టా​ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.

Late Inder Kumar's wife accuses Karan Johar, SRK of giving false hope
పల్లవి

''నా భర్త చనిపోయే ముందు ఇద్దరు సినీ ప్రముఖుల సాయం కోరినట్లు నాకు గుర్తుంది. అప్పటికే ఆయన చిన్న ప్రాజెక్టులు చేస్తున్నారు. కానీ మునపటిలా పెద్ద సినిమాలు చేయాలనుకున్నారు. ఆయన కరణ్​ జోహార్​ దగ్గరకు వెళ్లినప్పుడు నేనూ అక్కడే ఉన్నా. సుమారు 2 గంటల పాటు బయటే నిలబెట్టారు. ఆ తర్వాత అతడి మేనేజర్​ వచ్చి కరణ్​ పనిలో ఉన్నారని చెప్పాడు. కానీ అతను బయటికి వచ్చే వరకు ఎదురు చూశాం. కరణ్​ వచ్చి ఇప్పుడేం అవకాశాలు లేవని అన్నారు. అయినా అతని వెంట నా భర్త 15 ఏళ్లు తిరుగుతూనే ఉన్నాడు. కానీ ఎలాంటి అవకాశాలు లేవనే వాడు''

- పల్లవి, ఇందర్​ భార్య

షారుక్​ కూడా చివరివరకు తిప్పించుకొని అవకాశాలు లేవని అనేవాడని పల్లవి తెలిపారు. ప్రతిభావంతులకు సాయం చేసేందుకు కష్టమెందుకని.. భయపడాల్సిన అవసరం ఎందుకని బాలీవుడ్​ ప్రముఖులపై ప్రశ్నలు గుప్పించారు. ఇప్పటికైనా ఇండస్ట్రీలో నెపోటిజం ఆగిపోవాలని అన్నారు. ఆ విధమైన చర్యలు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Late Inder Kumar's wife accuses Karan Johar, SRK of giving false hope
పల్లవి​

ఇదీ చూడండి:బాలీవుడ్ నటులకు సోషల్​ మీడియా సెగ​

సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆత్యహత్యతో బాలీవుడ్​లో బంధుప్రీతి, పక్షపాతం రాజ్యమేలుతోదంటూ సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా దివంగత నటుడు ఇందర్​ కుమార్​ భార్య పల్లవి.. తన భర్త ఇండస్ట్రీలో నెపోటిజం బాధితుడిగా పేర్కొన్నారు. షారుక్​ ఖాన్​, కరణ్​ జోహార్​ లాంటి సినీ ప్రముఖులు ఇందర్​ కెరీర్​పై తీవ్ర ప్రభావం చూపించారంటూ విమర్శించారు. తన భర్త చనిపోవడానికి ముందు సినిమా అవకాశాల కోసం ఎంతో శ్రమించాడని ఇన్​స్టా​ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.

Late Inder Kumar's wife accuses Karan Johar, SRK of giving false hope
పల్లవి

''నా భర్త చనిపోయే ముందు ఇద్దరు సినీ ప్రముఖుల సాయం కోరినట్లు నాకు గుర్తుంది. అప్పటికే ఆయన చిన్న ప్రాజెక్టులు చేస్తున్నారు. కానీ మునపటిలా పెద్ద సినిమాలు చేయాలనుకున్నారు. ఆయన కరణ్​ జోహార్​ దగ్గరకు వెళ్లినప్పుడు నేనూ అక్కడే ఉన్నా. సుమారు 2 గంటల పాటు బయటే నిలబెట్టారు. ఆ తర్వాత అతడి మేనేజర్​ వచ్చి కరణ్​ పనిలో ఉన్నారని చెప్పాడు. కానీ అతను బయటికి వచ్చే వరకు ఎదురు చూశాం. కరణ్​ వచ్చి ఇప్పుడేం అవకాశాలు లేవని అన్నారు. అయినా అతని వెంట నా భర్త 15 ఏళ్లు తిరుగుతూనే ఉన్నాడు. కానీ ఎలాంటి అవకాశాలు లేవనే వాడు''

- పల్లవి, ఇందర్​ భార్య

షారుక్​ కూడా చివరివరకు తిప్పించుకొని అవకాశాలు లేవని అనేవాడని పల్లవి తెలిపారు. ప్రతిభావంతులకు సాయం చేసేందుకు కష్టమెందుకని.. భయపడాల్సిన అవసరం ఎందుకని బాలీవుడ్​ ప్రముఖులపై ప్రశ్నలు గుప్పించారు. ఇప్పటికైనా ఇండస్ట్రీలో నెపోటిజం ఆగిపోవాలని అన్నారు. ఆ విధమైన చర్యలు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Late Inder Kumar's wife accuses Karan Johar, SRK of giving false hope
పల్లవి​

ఇదీ చూడండి:బాలీవుడ్ నటులకు సోషల్​ మీడియా సెగ​

Last Updated : Jun 25, 2020, 6:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.