తమిళ స్టార్ విజయ్ సేతుపతి, బాలీవుడ్ అందాల భామ కత్రినా కైఫ్ కలిసి ఒకే సినిమాలో నటించనున్నారు. 'అంధాదున్' ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయం దాదాపు ఖరారు అయినప్పటికీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
వరుణ్ ధావన్తో 'ఎక్కిస్' చిత్రాన్ని గతేడాది మొదలుపెట్టిన శ్రీరామ్.. లాక్డౌన్ ప్రభావం, ఆర్థిక సమస్యల కారణంగా దానిని పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు విజయ్, కత్రినా కలిసి వేరే కథను తీసేందుకు సిద్ధమయ్యారు.
ప్రస్తుతం విజయ్ సేతుపతి బాలీవుడ్లో 'లాల్ సింగ్ చద్దా', 'ముంబయికర్'.. తమిళంలో 'కాతువాకుల రెండు కాదల్' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. 'నవరస' అంథాలజీలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. కత్రినా.. 'ఫోన్ బూత్'లో నటిస్తోంది. ఈమె హీరోయిన్గా చేసిన 'సూర్యవంశీ' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి : సేతుపతితో విభేదాలు.. 'విక్రమ్ వేద'కు ఆమిర్ దూరం!