జాతీయ స్థాయులో ఉత్తమ నటిగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎంపికైంది. మణికర్ణిక, పంగా సినిమాలకుగాను కంగనకు ఈ పురస్కారం వరించింది.
ఝాన్సీ లక్ష్మీబాయిగా కంగన నటించిన మణికర్ణిక సినిమా 2019లో విడుదలై ఆకట్టుకుంది. విడుదలైన 12 రోజుల్లోనే రూ.84 కోట్ల కలెక్షన్లు సాధించి బాక్సాఫీసు వద్ద ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.
కమల్జైన్ ఈ సినిమాను నిర్మించగా.. క్రిష్ జాగర్లమూడి, కంగన దర్శకత్వం వహించారు.
మంగళవారం(మార్చి 23) కంగన పుట్టినరోజు. అందుకు ఒక్కరోజు ముందే జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని కేంద్రం ప్రకటించగా... ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.