సినీనటి రష్మిక మందణ్నను ఆదాయపు పన్ను శాఖ అధికారులు.. మంగళవారం 3 గంటల పాటు విచారించారు. మైసూరులోని ఐటీశాఖ కార్యాలయంలో తండ్రి మదన్, తల్లి సుమన్లతోపాటు రష్మిక సుదీర్ఘ విచారణను ఎదుర్కొన్నారు. గత వారం విరాజ్పేటలోని ఆమె నివాసంతో పాటు సెరెనిటీ కమ్యూనిటీ హాల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గుర్తించిన రూ.25 లక్షల నగదు, ఇతర పత్రాలకు సంబంధించిన వివరాలను ఆమె నుంచి సేకరించారు. అవసరమైతే మరోమారు విచారణకు హాజరవ్వాలని అధికారులు సూచించారు.
