ETV Bharat / sitara

ఆర్టికల్​ 370 రద్దుతో 'సరిలేరు'కు సంబంధం ఏంటీ?

author img

By

Published : Jan 1, 2020, 6:30 AM IST

Updated : Jan 1, 2020, 8:43 AM IST

'సరిలేరు నీకెవ్వరు' చిత్రీకరణలో ఎదుర్కొన్న సంఘటనల వివరాలను నిర్మాత అనిల్​ సుంకర ఓ ఇంటర్య్వూలో పంచుకున్నాడు. జనవరి 11న సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు.

ఆర్టికల్​ 370 రద్దుతో 'సరిలేరు'కు సంబంధం ఏంటీ?
సరిలేరు నీకెవ్వరు సినిమాలో సూపర్​స్టార్ మహేశ్​బాబు

ఆర్టికల్ 370 రద్దు సమయంలో కశ్మీర్‌లో చిత్రీకరణ జరపకపోయుంటే 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సంక్రాంతి పండుగకు.. ప్రేక్షకుల ముందుకు వచ్చేదే కాదని నిర్మాత అనిల్ సుంకర తెలిపాడు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా అనిల్‌ సుంకర మీడియాతో మాట్లాడాడు.

mahesh babu in sarileru nekevvaru
సరిలేరు నీకెవ్వరు సినిమాలో సూపర్​స్టార్ మహేశ్​బాబు

"ఇప్పటికే 'సరిలేరు నీకెవ్వరు' డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యి.. సెన్సార్‌కు సిద్ధంగా ఉంది. అభిమానులు, కుటుంబ సభ్యులు, యువత.. ఇలా అందరికీ నచ్చేలా ఉంటుందీ చిత్రం. 13ఏళ్ల తర్వాత విజయశాంతి గారు తిరిగి వెండితెరపై కనపించనున్నారు. ఆమె నటన అద్భుతం. మహేశ్‌-విజయశాంతి కాంబినేషన్‌లోని సన్నివేశాలు ఊహించని రీతిలో ఉంటాయి. ఈ సినిమా షూటింగ్​కు యూనిట్‌ మొత్తం కశ్మీర్‌ వెళ్లాం. ఆ సమయంలో 'ఆర్టికల్‌ 370'ని రద్దు చేయాలని భావించిన కేంద్ర ప్రభుత్వం.. భద్రతను కట్టుదిట్టం చేసింది. మా వ్యాన్‌లు అన్ని ఆగిపోయాయి. ఆర్మీ మేజర్లు చాలా సహాయం చేశారు. మన డబ్బింగ్‌ సినిమాల్ని వారు చూస్తుంటారట. మహేశ్ బాబు అక్కడి వారికి తెలిసి ఉండటం వల్ల మా సినిమాకు కలిసి వచ్చింది. అంత భద్రత ఎందుకు ఉందో అప్పుడు అర్థం కాలేదు. ఆ తర్వాత ఆర్టికల్‌ 370ని రద్దు చేశారు."
- అనిల్​ సుంకర, టాలీవుడ్​ నిర్మాత

'సరిలేరు నీకెవ్వరు' చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించాడు. జనవరి 11న సినిమా విడుదలకు సిద్ధమౌతోంది.

ఇదీ చదవండి:- 'వ్యక్తుల ప్రాధాన్యత బట్టి పాత్రలు ఇవ్వను'

ఆర్టికల్ 370 రద్దు సమయంలో కశ్మీర్‌లో చిత్రీకరణ జరపకపోయుంటే 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సంక్రాంతి పండుగకు.. ప్రేక్షకుల ముందుకు వచ్చేదే కాదని నిర్మాత అనిల్ సుంకర తెలిపాడు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా అనిల్‌ సుంకర మీడియాతో మాట్లాడాడు.

mahesh babu in sarileru nekevvaru
సరిలేరు నీకెవ్వరు సినిమాలో సూపర్​స్టార్ మహేశ్​బాబు

"ఇప్పటికే 'సరిలేరు నీకెవ్వరు' డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యి.. సెన్సార్‌కు సిద్ధంగా ఉంది. అభిమానులు, కుటుంబ సభ్యులు, యువత.. ఇలా అందరికీ నచ్చేలా ఉంటుందీ చిత్రం. 13ఏళ్ల తర్వాత విజయశాంతి గారు తిరిగి వెండితెరపై కనపించనున్నారు. ఆమె నటన అద్భుతం. మహేశ్‌-విజయశాంతి కాంబినేషన్‌లోని సన్నివేశాలు ఊహించని రీతిలో ఉంటాయి. ఈ సినిమా షూటింగ్​కు యూనిట్‌ మొత్తం కశ్మీర్‌ వెళ్లాం. ఆ సమయంలో 'ఆర్టికల్‌ 370'ని రద్దు చేయాలని భావించిన కేంద్ర ప్రభుత్వం.. భద్రతను కట్టుదిట్టం చేసింది. మా వ్యాన్‌లు అన్ని ఆగిపోయాయి. ఆర్మీ మేజర్లు చాలా సహాయం చేశారు. మన డబ్బింగ్‌ సినిమాల్ని వారు చూస్తుంటారట. మహేశ్ బాబు అక్కడి వారికి తెలిసి ఉండటం వల్ల మా సినిమాకు కలిసి వచ్చింది. అంత భద్రత ఎందుకు ఉందో అప్పుడు అర్థం కాలేదు. ఆ తర్వాత ఆర్టికల్‌ 370ని రద్దు చేశారు."
- అనిల్​ సుంకర, టాలీవుడ్​ నిర్మాత

'సరిలేరు నీకెవ్వరు' చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించాడు. జనవరి 11న సినిమా విడుదలకు సిద్ధమౌతోంది.

ఇదీ చదవండి:- 'వ్యక్తుల ప్రాధాన్యత బట్టి పాత్రలు ఇవ్వను'

Aligarh (UP), Dec 31 (ANI): Omar Saleem Peerzada,Aligarh Muslim University (AMU) PRO informed that campus is normal now and AMU administration intends to open the University in phases. "Campus is normal now. AMU administration intends to open the University in phases. Vice Chancellor had written a letter to students expressing his sadness over the incident of Dec 15 and injuries sustained by protesting students," said AMU PRO.
Last Updated : Jan 1, 2020, 8:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.