భారత్లో లాక్డౌన్ సమయంలో వృద్ధులు, రోజువారి కార్మికులు, అల్ప ఆదాయ వర్గాల వారు చాలామంది ఆకలితో అలమటిస్తున్నారు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్.. తాజాగా వారికి సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. అక్షయ పాత్ర ఫౌండేషన్తో కలిసి, ప్రతిరోజూ లక్ష 20 వేల మందికి ఆహారం అందజేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్లో పంచుకుందీ సంస్థ.
"సూపర్స్టార్ హృతిక్రోషన్తో కలిసి ఈ సాయం చేయనుండటం మా సంస్థకు సంతోషమైన విషయం. కరోనా ప్రభావం తగ్గేవరకు వృద్ధాశ్రమాలకు, రోజువారి కార్మికులకు, అల్పఅదాయవర్గాల వారికి.. లక్ష 20 వేల మందికి ఆహారం అందజేయబోతున్నాం. మాతో కలిసి పనిచేసేందుకు అంగీకరించిన హృతిక్కు హృదయపూర్వక ధన్యవాదాలు" -అక్షయపాత్ర ఫౌండేషన్ ట్వీట్
ఈ విషయంపై స్పందించిన హృతిక్.. ఈ సంస్థ, అందులో పనిచేస్తున్న వారే 'రియల్ సూపర్ హీరోస్' అంటూ ప్రశంసించాడు.
"ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ ఆకలితో నిద్రపోకుండా చూస్తారని భావిస్తున్నా. ఈ కార్యక్రమంలో భాగమైన మీరే రియల్ సూపర్ హీరోస్. మనకు వీలైనంత సాయం చేద్దాం. వాటిలో ఎక్కువ తక్కువ తేడాలు లేవు" -హృతిక్ రోషన్ ట్వీట్
ఇలానే మంబయి మున్సిపల్ కార్మికుల కోసం మాస్క్లు తయారు చేయనున్నట్లు గత నెలలో ప్రకటించాడు హృతిక్. త్వరలో వాటిని అందజేయనున్నాడు.