ETV Bharat / sitara

"ఆచార్య', 'విరాట పర్వం' చిత్రాలకు అనుమతి ఇవొద్దు!'

author img

By

Published : Apr 10, 2021, 11:17 AM IST

Updated : Apr 10, 2021, 11:37 AM IST

నక్సలిజాన్ని ప్రోత్సహించే చిత్రాలకు సెన్సార్​ అనుమతి ఇవ్వరాదంటూ తీవ్రవాద నిరోధక ఫోరం(ఏఎఫ్​టీ) బృందం డిమాండ్​ చేసింది. చిరంజీవి, రానా కొత్త చిత్రాలైన 'ఆచార్య', 'విరాట పర్వం' సినిమాల్లో మావోయిస్టు భావజాలాన్ని చూపించే అవకాశం ఉన్నందున.. ఆ సినిమాలకు అనుమతి ఇవ్వరాదంటూ సెన్సార్​ అధికారులకు బృందం విన్నవించుకుంది. లేని పక్షంలో సినిమాల ప్రదర్శనను నిలిపేస్తామంటూ ఆ సభ్యులు స్పష్టం చేశారు.

Do not issue censor certificates for Acharya and Virata Parvam Movies
"ఆచార్య', 'విరాట పర్వం' చిత్రాలకు అనుమతి ఇవొద్దు!'

ఛత్తీస్​గడ్​లోని ఇటీవలే సీఆర్​పీఎఫ్​ జవాన్లపై మావోయిస్టు బృందం దాడి చేసింది. దీని ఫలితంగా 22 మంది సీఆర్​పీఎఫ్​ సిబ్బంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో మావోయిజం, నక్సలిజం లాంటి భావాజాలాలను ప్రోత్సహించే చిత్రాలను తెలుగు చిత్రసీమలో నిర్మిస్తున్నారని తీవ్రవాద నిరోధక ఫోరం (ఏఎఫ్​టీ) బృంద సభ్యులు అంటున్నారు. చిరంజీవి, రామ్​చరణ్​, రానా నటిస్తున్న 'ఆచార్య', 'విరాట పర్వం' సినిమాలు ఈ కోవకే చెందినవని వారు అభిప్రాయపడ్డారు.

Do not issue censor certificates for Acharya and Virata Parvam Movies
తీవ్రవాద నిరోధక ఫోరం బృందం లేఖ

అయితే సమాజంలో ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నక్సలిజం భావజాలాన్ని ప్రోత్సహించే చిత్రాలకు ధ్రువీకరణ పత్రం ఇవ్వొద్దని ఏఎఫ్​టీ బృందం సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ ఫిల్మ్​ సెన్సార్​(సీబీఎఫ్​సీ)కి విన్నవించుకుంది. భవిష్యత్​లోనూ ఇలాంటి చిత్రాలకు సెన్సార్​ సర్టిఫికేట్​ జారీ చేయకూడదని ఆ సభ్యులు సూచించారు. యువతపై దుష్ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున ఈ సినిమాల విడుదలకు తాము వ్యతిరేకమని వెల్లడించారు. ఒకవేళ ఆ చిత్రాలు థియేటర్లలో విడుదలైతే వాటిని అడ్డుకుంటామని ఏఎఫ్​టీ సభ్యులు తేల్చిచెప్పారు.

Do not issue censor certificates for Acharya and Virata Parvam Movies
సెన్సార్​ అధికారిని కలిసిన తీవ్రవాద నిరోధక ఫోరం బృందం
Do not issue censor certificates for Acharya and Virata Parvam Movies
తీవ్రవాద నిరోధక ఫోరం బృందం వివరణ

ఇదీ చూడండి: క్యాష్​ షోలో 'వకీల్​సాబ్​' టీమ్​ సందడి

ఛత్తీస్​గడ్​లోని ఇటీవలే సీఆర్​పీఎఫ్​ జవాన్లపై మావోయిస్టు బృందం దాడి చేసింది. దీని ఫలితంగా 22 మంది సీఆర్​పీఎఫ్​ సిబ్బంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో మావోయిజం, నక్సలిజం లాంటి భావాజాలాలను ప్రోత్సహించే చిత్రాలను తెలుగు చిత్రసీమలో నిర్మిస్తున్నారని తీవ్రవాద నిరోధక ఫోరం (ఏఎఫ్​టీ) బృంద సభ్యులు అంటున్నారు. చిరంజీవి, రామ్​చరణ్​, రానా నటిస్తున్న 'ఆచార్య', 'విరాట పర్వం' సినిమాలు ఈ కోవకే చెందినవని వారు అభిప్రాయపడ్డారు.

Do not issue censor certificates for Acharya and Virata Parvam Movies
తీవ్రవాద నిరోధక ఫోరం బృందం లేఖ

అయితే సమాజంలో ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నక్సలిజం భావజాలాన్ని ప్రోత్సహించే చిత్రాలకు ధ్రువీకరణ పత్రం ఇవ్వొద్దని ఏఎఫ్​టీ బృందం సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ ఫిల్మ్​ సెన్సార్​(సీబీఎఫ్​సీ)కి విన్నవించుకుంది. భవిష్యత్​లోనూ ఇలాంటి చిత్రాలకు సెన్సార్​ సర్టిఫికేట్​ జారీ చేయకూడదని ఆ సభ్యులు సూచించారు. యువతపై దుష్ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున ఈ సినిమాల విడుదలకు తాము వ్యతిరేకమని వెల్లడించారు. ఒకవేళ ఆ చిత్రాలు థియేటర్లలో విడుదలైతే వాటిని అడ్డుకుంటామని ఏఎఫ్​టీ సభ్యులు తేల్చిచెప్పారు.

Do not issue censor certificates for Acharya and Virata Parvam Movies
సెన్సార్​ అధికారిని కలిసిన తీవ్రవాద నిరోధక ఫోరం బృందం
Do not issue censor certificates for Acharya and Virata Parvam Movies
తీవ్రవాద నిరోధక ఫోరం బృందం వివరణ

ఇదీ చూడండి: క్యాష్​ షోలో 'వకీల్​సాబ్​' టీమ్​ సందడి

Last Updated : Apr 10, 2021, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.