ETV Bharat / sitara

రణ్​వీర్​ - రోహిత్​ శెట్టిల కామెడీ 'సర్కస్​'

author img

By

Published : Oct 19, 2020, 12:22 PM IST

బాలీవుడ్​ స్టార్ డైరెక్టర్​ రోహిత్​ శెట్టి, రణ్​వీర్​ సింగ్​ కాంబోలో మరోచిత్రం రూపొందనుంది. కామెడీ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'సర్కస్'​ అనే టైటిల్​ ఖరారు చేశారు. వచ్చే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

Confirmed! Ranveer Singh, Rohit Shetty to collaborate on Comedy of Errors' adaptation Cirkus
రణ్​వీర్​ సింగ్​ - రోహిత్​ శెట్టి కొత్త చిత్రం 'సర్కస్​'

బాలీవుడ్​ స్టార్​ హీరో రణ్​వీర్​ సింగ్​ - దర్శకుడు రోహిత్​ శెట్టి కాంబినేషన్​లో మరో చిత్రం రానుంది. 'సర్కస్​' అనే కామెడీ కథాంశంతో ఓ సినిమా రూపొందించనున్నట్లు మంగళవారం అధికారిక ప్రకటన వెల్లడించింది చిత్రబృందం. గతంలో వీరిద్దరూ కలిసి పనిచేసిన 'సింబా' విజయవంతమవ్వడం వల్ల ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

ఇంగ్లీష్​ రచయిత షేక్స్​పియర్​ రాసిన క్లాసికల్ కామెడీ ఆధారంగా 'సర్కస్​' రూపొందనుంది. కవలలుగా పుట్టిన ఇద్దరు పిల్లలు అనుకోకుండా ఎలా విడిపోయారనే దాని చుట్టూ జరిగే కథతో తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని టీ-సిరీస్​, రిలయన్స్​ ఎంటర్​టైన్మెంట్స్​తో కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా నటించనున్నారు.

నవంబరులో ఈ సినిమా సెట్స్​పైకి వెళ్లనుంది. ముంబయి, ఊటీ, గోవాలో షూటింగ్ జరపనున్నారు. 2021 చివర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

బాలీవుడ్​ స్టార్​ హీరో రణ్​వీర్​ సింగ్​ - దర్శకుడు రోహిత్​ శెట్టి కాంబినేషన్​లో మరో చిత్రం రానుంది. 'సర్కస్​' అనే కామెడీ కథాంశంతో ఓ సినిమా రూపొందించనున్నట్లు మంగళవారం అధికారిక ప్రకటన వెల్లడించింది చిత్రబృందం. గతంలో వీరిద్దరూ కలిసి పనిచేసిన 'సింబా' విజయవంతమవ్వడం వల్ల ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

ఇంగ్లీష్​ రచయిత షేక్స్​పియర్​ రాసిన క్లాసికల్ కామెడీ ఆధారంగా 'సర్కస్​' రూపొందనుంది. కవలలుగా పుట్టిన ఇద్దరు పిల్లలు అనుకోకుండా ఎలా విడిపోయారనే దాని చుట్టూ జరిగే కథతో తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని టీ-సిరీస్​, రిలయన్స్​ ఎంటర్​టైన్మెంట్స్​తో కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా నటించనున్నారు.

నవంబరులో ఈ సినిమా సెట్స్​పైకి వెళ్లనుంది. ముంబయి, ఊటీ, గోవాలో షూటింగ్ జరపనున్నారు. 2021 చివర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.