ETV Bharat / sitara

రాజకీయ నాయకులకు నిబంధనలు వర్తించవా?

author img

By

Published : Jul 13, 2020, 6:52 AM IST

సినిమా షూటింగ్స్ విషయంలో కేంద్రం విధించిన నిబంధనలపై కొందరు బాలీవుడ్ ప్రముఖులు మండిపడుతున్నారు. '65 ఏళ్లు' అనేది రాజకీయ నాయకులకు వర్తించవా అని ప్రశ్నిస్తున్నారు.

రాజకీయ నాయకులకు నిబంధనలు వర్తించవా?
షభానా అజ్మీ- పరేశ్ రావల్

కరోనా.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సినిమాల చిత్రీకరణ నిలిచిపోయి చాలాకాలమైంది. గత మూడు నెలలుగా నటీనటులంతా షూటింగ్స్‌ లేక ఇంట్లోనే ఉంటున్నారు. అయితే చిత్రకరణల కోసం కొన్ని నిబంధనలతో కూడిన అనుమతులిస్తామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 65ఏళ్లు పైబడిన నటీనటులు చిత్రీకరణలో పాల్గొనకూడదని పేర్కొంది. ఈ విషయమై పలువురు బాలీవుడ్‌ సీనియర్‌ నటులు మండిపడుతున్నారు. ఈ చర్య వివక్ష చూపుతున్నట్లుగా ఉందని విమర్శిస్తున్నారు. దీని గురించే గతవారం, నటి హేమమాలిని హోంశాఖకు లేఖ రాశారు. ఈ నిబంధనల వల్ల మధ్యలో ఆగిపోయిన సినిమాలను పూర్తి చేయలేరని, వీటిలో మార్పులు చేయాలని కోరారు. తాజాగా మరికొందరు ఈ అంశాన్ని లేవనెత్తారు.

బాలీవుడ్‌ సీనియర్ నటి, 69 ఏళ్ల షబానా అజ్మీ.. ప్రస్తుతం నిఖిల్‌ అడ్వాణీ దర్శకత్వంలో 'మొగల్‌' చిత్రంలో, వికాస్‌ ఖన్నా తీస్తున్న మరో సినిమాలో నటిస్తున్నారు. లాక్‌డౌన్‌ వల్ల షూటింగ్‌లు నిల్చిపోయాయి. కేంద్రం విధించిన నిబంధనతో ఆ రెండు సినిమాల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నిస్తున్నారు.

"వికాస్‌ ఖన్నా చిత్రంలో నేను మరికొన్ని సీన్లలో నటించాల్సి ఉంది. ఇప్పుడు ఆ సినిమా పరిస్థితి ఏంటి? ఈ నిబంధన వల్ల నిర్మాతలు వయసులో ఉన్న నటులను తీసుకొని వృద్ధుల వేషాలు వేయించాలా? ఇది కేవలం చిత్ర పరిశ్రమకే ఎందుకు? రాజకీయ నాయకులకు వర్తించదా? సినీరంగంలో పనిచేసే చాలామందికి వేరే ఆదాయం ఉండదు. వారిపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది" అని వెల్లడించారు.

వృద్ధులను సురక్షితంగా ఉంచాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుంటాం. కానీ ఇది ఆచరణయోగ్యం కాదు. సినిమా సెట్స్‌లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. పరిశుభ్రత పాటిస్తూ, శానిటైజేషన్‌ చేసుకుంటూ షూటింగ్స్‌ చేసుకోవచ్చు. ప్రస్తుత సంక్షోభంలో 65 ఏళ్లు పైబడిన డాక్టర్లు, నర్సులు సేవలు అందిస్తున్నారు. వారికి కరోనా సోకే అవకాశాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. - పరేశ్‌ రావల్‌

కరోనా.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సినిమాల చిత్రీకరణ నిలిచిపోయి చాలాకాలమైంది. గత మూడు నెలలుగా నటీనటులంతా షూటింగ్స్‌ లేక ఇంట్లోనే ఉంటున్నారు. అయితే చిత్రకరణల కోసం కొన్ని నిబంధనలతో కూడిన అనుమతులిస్తామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 65ఏళ్లు పైబడిన నటీనటులు చిత్రీకరణలో పాల్గొనకూడదని పేర్కొంది. ఈ విషయమై పలువురు బాలీవుడ్‌ సీనియర్‌ నటులు మండిపడుతున్నారు. ఈ చర్య వివక్ష చూపుతున్నట్లుగా ఉందని విమర్శిస్తున్నారు. దీని గురించే గతవారం, నటి హేమమాలిని హోంశాఖకు లేఖ రాశారు. ఈ నిబంధనల వల్ల మధ్యలో ఆగిపోయిన సినిమాలను పూర్తి చేయలేరని, వీటిలో మార్పులు చేయాలని కోరారు. తాజాగా మరికొందరు ఈ అంశాన్ని లేవనెత్తారు.

బాలీవుడ్‌ సీనియర్ నటి, 69 ఏళ్ల షబానా అజ్మీ.. ప్రస్తుతం నిఖిల్‌ అడ్వాణీ దర్శకత్వంలో 'మొగల్‌' చిత్రంలో, వికాస్‌ ఖన్నా తీస్తున్న మరో సినిమాలో నటిస్తున్నారు. లాక్‌డౌన్‌ వల్ల షూటింగ్‌లు నిల్చిపోయాయి. కేంద్రం విధించిన నిబంధనతో ఆ రెండు సినిమాల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నిస్తున్నారు.

"వికాస్‌ ఖన్నా చిత్రంలో నేను మరికొన్ని సీన్లలో నటించాల్సి ఉంది. ఇప్పుడు ఆ సినిమా పరిస్థితి ఏంటి? ఈ నిబంధన వల్ల నిర్మాతలు వయసులో ఉన్న నటులను తీసుకొని వృద్ధుల వేషాలు వేయించాలా? ఇది కేవలం చిత్ర పరిశ్రమకే ఎందుకు? రాజకీయ నాయకులకు వర్తించదా? సినీరంగంలో పనిచేసే చాలామందికి వేరే ఆదాయం ఉండదు. వారిపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది" అని వెల్లడించారు.

వృద్ధులను సురక్షితంగా ఉంచాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుంటాం. కానీ ఇది ఆచరణయోగ్యం కాదు. సినిమా సెట్స్‌లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. పరిశుభ్రత పాటిస్తూ, శానిటైజేషన్‌ చేసుకుంటూ షూటింగ్స్‌ చేసుకోవచ్చు. ప్రస్తుత సంక్షోభంలో 65 ఏళ్లు పైబడిన డాక్టర్లు, నర్సులు సేవలు అందిస్తున్నారు. వారికి కరోనా సోకే అవకాశాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. - పరేశ్‌ రావల్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.