నేడు బాలీవుడ్ హీరో సల్మాన్ఖాన్.. కృష్ణ జింకల వేట కేసులో జోధ్పూర్ కోర్టు ముందుకు హాజరుకానున్నాడు. అయితే అతడికి గ్యారీ షూటర్ అనే గ్యాంగ్స్టర్ నుంచి ప్రాణాపాయం ఉన్న నేపథ్యంలో కోర్టుకు హాజరవుతాడా లేదా అనేది ప్రశ్న.
గతేడాది మేలో ఈ కేసులో సల్మాన్కు బెయిల్ ముంజూరైంది. అప్పటి నుంచి కోర్టు మెట్లేక్కలేదు ఈ నటుడు. ఈ ఏడాది జూలై 4న జరిగిన విచారణ సందర్భంగా, సెప్టెంబరు 27న కోర్టు ముందు హాజరు కావాలని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి చంద్ర కుమార్ సొరంగా తీర్పిచ్చారు. లేదంటే సల్మాన్కు బెయిల్ రద్దవుతుందని చెప్పారు.
ఈ విషయంపై స్పందించిన స్థానిక పోలీసులు.. భద్రతా కల్పిస్తామని హామీ ఇచ్చినా ఇన్ని రోజులు సల్మాన్ హాజరు కాలేదని తెలిపారు.
1998లో 'హమ్ సాత్ సాత్ హైన్' సినిమా షూటింగ్ సందర్భంగా జోథ్పూర్లోని కంకణి గ్రామంలో.. సల్మాన్, సైఫ్ అలీ ఖాన్, సొనాలీ బింద్రే, టబు, నీలమ్.. కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద వారిపై కేసు నమోదైంది.
ఇది చదవండి: మరుగుజ్జు విలన్తో వస్తోన్న 'మర్జావాన్'