ETV Bharat / sitara

Atreya Sahithi book launch: ఆత్రేయ ఒక సాహితీ వటవృక్షం: బ్రహ్మానందం - రంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

Atreya Sahithi book launch event: ఆత్రేయ సాహితీ వటవృక్షమని ప్రముఖ సినీనటుడు బ్రహ్మానందం అన్నారు. అతన్ని అందరూ హేతువాదంటారు కానీ... ఆయనో అద్భుతమైన ఫిలాసఫర్​ అని తెలిపారు. మేధావిలా ఆలోచించి సామాన్యుని కోసం అనేక పాటలు రాశారని పేర్కొన్నారు.

Atreya Sahithi book launch
Atreya Sahithi book launch
author img

By

Published : Nov 28, 2021, 12:03 PM IST

ఆత్రేయ సినీ వేమన అని ప్రముఖ సినీనటుడు బ్రహ్మానందం అన్నారు. అతను ఒక విశ్వకవి వృక్షమని తెలిపారు. మేధావిలా ఆలోచించి సామాన్యుని కోసం అనేక పాటలు రాశారని పేర్కొన్నారు. పైడిపాల రాసిన ఆత్రేయ సాహితీ, ఆత్రేయ సినీ గేయ సర్వస్వం అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం మాదాపూర్‌లోని ఫీనిక్స్‌ ఎరీనాలో(Atreya Sahithi book launch event at Madhapur) జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఆత్రేయను అందరూ హేతువాదంటారు కానీ... ఆయనో అద్భుతమైన ఫిలాసఫర్​ని తెలిపారు. మనసు గతిఇంతే మనిషి బతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే అని ఆయన ఎంతో అద్భుతంగా చెప్పారని(Atreya Cine Geya Sarvaswam book) పేర్కొన్నారు. అలతి అలతి పదాలతో అత్యద్భుతమైన రచన చేశారని తెలిపారు. 1636 పాటలు రాయడం మాటలు కాదన్నారు. ప్రేమ గురించి... ప్రేమికులు ఎలా ఉండాలో ఆ రోజుల్లోనే ఆయన చెప్పారని పేర్కొన్నారు.

ఆయన మాటను నేటి సమాజానికి ఉపయోగపడుతున్నాయని బ్రహ్మానందం(brahmanandam news) అన్నారు. కారులో షికారు కెళ్లే పాలబుగ్గల పసిడిచానా పాట విన్న తరువాత ఆత్రేయను మించిన కమ్యూనిస్టు కవి ఎవరున్నారనిపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో (Atreya Sahithi book launch event) సినీ గేయ కవి సుద్దాల అశోక్‌ తేజ, శాంతా బయోటెక్నిక్స్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ వరప్రసాద్‌రెడ్డి, మానసిక వైద్యులు డాక్టర్‌ ఇండ్ల రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Historic monuments in Telangana : చారిత్రక కట్టడాలపై ఏఎస్‌ఐ సర్వే.. రాష్ట్రవ్యాప్తంగా 30 నిర్మాణాల పరిశీలన

ఆత్రేయ సినీ వేమన అని ప్రముఖ సినీనటుడు బ్రహ్మానందం అన్నారు. అతను ఒక విశ్వకవి వృక్షమని తెలిపారు. మేధావిలా ఆలోచించి సామాన్యుని కోసం అనేక పాటలు రాశారని పేర్కొన్నారు. పైడిపాల రాసిన ఆత్రేయ సాహితీ, ఆత్రేయ సినీ గేయ సర్వస్వం అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం మాదాపూర్‌లోని ఫీనిక్స్‌ ఎరీనాలో(Atreya Sahithi book launch event at Madhapur) జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఆత్రేయను అందరూ హేతువాదంటారు కానీ... ఆయనో అద్భుతమైన ఫిలాసఫర్​ని తెలిపారు. మనసు గతిఇంతే మనిషి బతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే అని ఆయన ఎంతో అద్భుతంగా చెప్పారని(Atreya Cine Geya Sarvaswam book) పేర్కొన్నారు. అలతి అలతి పదాలతో అత్యద్భుతమైన రచన చేశారని తెలిపారు. 1636 పాటలు రాయడం మాటలు కాదన్నారు. ప్రేమ గురించి... ప్రేమికులు ఎలా ఉండాలో ఆ రోజుల్లోనే ఆయన చెప్పారని పేర్కొన్నారు.

ఆయన మాటను నేటి సమాజానికి ఉపయోగపడుతున్నాయని బ్రహ్మానందం(brahmanandam news) అన్నారు. కారులో షికారు కెళ్లే పాలబుగ్గల పసిడిచానా పాట విన్న తరువాత ఆత్రేయను మించిన కమ్యూనిస్టు కవి ఎవరున్నారనిపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో (Atreya Sahithi book launch event) సినీ గేయ కవి సుద్దాల అశోక్‌ తేజ, శాంతా బయోటెక్నిక్స్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ వరప్రసాద్‌రెడ్డి, మానసిక వైద్యులు డాక్టర్‌ ఇండ్ల రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Historic monuments in Telangana : చారిత్రక కట్టడాలపై ఏఎస్‌ఐ సర్వే.. రాష్ట్రవ్యాప్తంగా 30 నిర్మాణాల పరిశీలన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.