దాదాపు ఏడాది విరామం తర్వాత ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది అనుష్క శెట్టి. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'నిశ్శబ్దం'. మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా అనుష్కతో కలిసున్న ఫొటోలను ట్వీట్ చేశారు నిర్మాత కోన వెంకట్.
'చివరకు 'నిశ్శబ్దం' షూటింగ్ పూర్తయింది. మీకు థ్రిల్లర్ సినిమాను చూపించేందుకు మేమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.' -కోన వెంకట్, నిర్మాత
హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడ్సెన్, అంజలి, శాలిని పాండే, సుబ్బరాజ్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. గోపీ సుందర్ సంగీతం అందించాడు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించాడు. ఎప్పుడు విడుదల చేస్తారనేది త్వరలో ప్రకటించనున్నారు.
![Nishabdham movie team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4047797_anushka-3.jpg)
![Nishabdham movie team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4047797_anushka-2.jpg)
ఇదీ చూడండి: 'చాలా తీసుకున్నాం తిరిగి ఇచ్చేయాలి'