ETV Bharat / sitara

హీరోకు కరోనా.. ఆగిన సినిమా షూటింగ్​

author img

By

Published : Dec 4, 2020, 6:25 PM IST

బాలీవుడ్​ ప్రముఖ కథానాయకుడు వరుణ్​ ధావన్​కు కరోనా సోకినట్లు సమాచారం. దీంతో అతడు కొత్త సినిమా షూటింగ్ ఆపేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై చిత్రబృందం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

Anil Kapoor, Neetu Kapoor, Varun Dhawan and director Raj Mehta test COVID-19 positive
వరుణ్​ ధావన్​కు కరోనా.. ఆగిపోయిన షూటింగ్​

బాలీవుడ్​ నటుడు వరుణ్​ ధావన్​కు కరోనా సోకినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'జగ్​ జగ్​ జీయో' సినిమా షూటింగ్​ కోసం ఇటీవల చండీగఢ్​ చేరుకున్న చిత్రబృందం వైద్య పరీక్షలు చేసుకోగా, అందులో వరుణ్​తో పాటు నటి నీతూ కపూర్​, దర్శకుడు రాజ్​ మెహతాలకు కొవిడ్​ పాజిటివ్​గా తేలినట్లు తెలుస్తోంది.

దీంతో ఆ ముగ్గురూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారని సమాచారం. చిత్రబృందం ఇప్పటికే ముంబయి తిరుగు ప్రయాణమయ్యారు. సీనియర్​ నటుడు అనిల్​ కపూర్​కు మాత్రం నెగటివ్​గా తేలిందని ఓ నివేదిక తెలియజేసింది.

Anil Kapoor, Neetu Kapoor, Varun Dhawan and director Raj Mehta test COVID-19 positive
చండీగఢ్​ చేరుకున్న చిత్రబృందం (పాతచిత్రం)

ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇందులో కియారా అడ్వాణీ హీరోయిన్​, సీనియర్​ స్టార్స్ నీతూ కపూర్​, అనిల్​ కపూర్, మనీష్​ పాల్​ ప్రజక్త​ కీలకపాత్రలు పోషిస్తున్నారు. నీతూ కపూర్​ ఏడేళ్ల తర్వాత తిరిగి నటిస్తున్న సినిమా ఇది. కరణ్​ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వచ్చే ఏడాది తీసుకురానున్నారు.

ఇదీ చూడండి: 'ట్రైలర్​' కథేంటి? దాన్ని మొదలుపెట్టింది ఎవరు?

బాలీవుడ్​ నటుడు వరుణ్​ ధావన్​కు కరోనా సోకినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'జగ్​ జగ్​ జీయో' సినిమా షూటింగ్​ కోసం ఇటీవల చండీగఢ్​ చేరుకున్న చిత్రబృందం వైద్య పరీక్షలు చేసుకోగా, అందులో వరుణ్​తో పాటు నటి నీతూ కపూర్​, దర్శకుడు రాజ్​ మెహతాలకు కొవిడ్​ పాజిటివ్​గా తేలినట్లు తెలుస్తోంది.

దీంతో ఆ ముగ్గురూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారని సమాచారం. చిత్రబృందం ఇప్పటికే ముంబయి తిరుగు ప్రయాణమయ్యారు. సీనియర్​ నటుడు అనిల్​ కపూర్​కు మాత్రం నెగటివ్​గా తేలిందని ఓ నివేదిక తెలియజేసింది.

Anil Kapoor, Neetu Kapoor, Varun Dhawan and director Raj Mehta test COVID-19 positive
చండీగఢ్​ చేరుకున్న చిత్రబృందం (పాతచిత్రం)

ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇందులో కియారా అడ్వాణీ హీరోయిన్​, సీనియర్​ స్టార్స్ నీతూ కపూర్​, అనిల్​ కపూర్, మనీష్​ పాల్​ ప్రజక్త​ కీలకపాత్రలు పోషిస్తున్నారు. నీతూ కపూర్​ ఏడేళ్ల తర్వాత తిరిగి నటిస్తున్న సినిమా ఇది. కరణ్​ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వచ్చే ఏడాది తీసుకురానున్నారు.

ఇదీ చూడండి: 'ట్రైలర్​' కథేంటి? దాన్ని మొదలుపెట్టింది ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.