బిగ్బీ అమితాబ్ బచ్చన్.. ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొణెతో మూడోసారి కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యారు. ఇంతకు ముందు వీరిద్దరూ 'పీకూ'లో నటించగా.. ప్రభాస్-నాగ్ అశ్విన్ ప్రాజెక్టులో చేయనున్నారు.
![The Intern](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11287541_as-1.jpg)
రిషి కపూర్ స్థానంలో అమితాబ్
హాలీవుడ్ హిట్ సినిమా 'ది ఇంటెర్న్'ను హిందీ రీమేక్ చేయనున్నట్లు గతేడాది ప్రకటించారు. రిషి కపూర్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తారని అప్పుడు వెల్లడించారు. ఆ తర్వాత కరోనాతో లాక్డౌన్ పెట్టడం, కొన్నాళ్ల తర్వాత రిషి కపూర్ అనారోగ్యంతో మరణించడం వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయింది.
ఇప్పుడా ప్రాజెక్ట్ను మళ్లీ పట్టాలెక్కించాలని నిర్ణయించింది చిత్రబృందం. రిషి కపూర్ స్థానంలో అమితాబ్ను తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి అమిత్ రవీందర్నాథ్ శర్మ దర్శకత్వం వహించనున్నారు. సునీర్ ఖేతర్పాల్, దీపికా పదుకొణె సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: అమితాబ్ 'చెహ్రే' విడుదల తేదీ వాయిదా