ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అబ్దుల్ కలాం. సరిగ్గా పద్దెనిమిదేళ్ల క్రితం 2002 ఇదే రోజున భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే తాజాగా ఆయనను స్మరించుకుంటూ అమెరికాకు చెందిన పింక్ జాగ్వార్స్ ఫిల్మ్ కంపెనీ నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా ఆయన గౌరవార్థం 'మిషన్ కలాం' పేరుతో ఆన్లైన్ కన్వెన్షన్ను నేడు ప్రారంభించారు. మొత్తం 11 వారాల పాటు దీన్ని నిర్వహిస్తారు. చివరి సెషన్ అక్టోబర్ 15న కలాం జయంతి రోజున ముగుస్తుంది. ఇందులో వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొని పలు అంశాలపై ప్రసంగిస్తారు.
అబ్దుల్ కలాం బయోపిక్ను తెరకెక్కిస్తున్నట్లు అమెరికన్ దర్శకుడు జగదీశ్ దానేటి ఇటీవల ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ను కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ విడుదల చేశారు.
ఇది చూడండి ఆగస్టు 8న రానా పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన హీరో