'మీర్జాపూర్' రెండో సీజన్.. విడుదలైన ఏడు రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్లో అత్యధికులు వీక్షించిన వెబ్ సిరీస్గా చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా మూడో భాగాన్ని తీయనున్నట్లు సదరు ఓటీటీ సంస్థ వెల్లడించింది. త్వరలో షూటింగ్ ప్రారంభించనున్నారు.

మీర్జాపుర్ కథేంటి?
యాక్షన్ క్రైమ్ థ్రిల్లరగా రూపొందిన ఈ సిరీస్లో డ్రగ్స్, గన్స్, హత్యల చుట్టూనే కథ సాగుతుంది. అధికారం కోసం ఓ బడా డాన్కు, సాధారణ వ్యక్తికి మధ్య జరిగిన పోరాటమే ఈ సిరీస్. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు శర్మ, శ్వేతా త్రిపాఠి, రషిక దుగల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
అత్యధిక వీక్షణలు
విడుదలైన 48 గంటల్లోనే చాలామంది నెటిజన్లు రెండో సీజన్ను వీక్షించారు. దీంతో అమెజాన్ ప్రైమ్లో అత్యధిక వ్యూస్ అందుకున్న తొలి సిరీస్గా 'మీర్జాపుర్' రెండో సీజన్ నిలిచింది.
మూడో సీజన్ కోసం 'గోలు' వెయిటింగ్
'మీర్జాపూర్' సిరీస్ను ఆదరించిన వారికి కృతజ్ఞతలు చెప్పిన నటి శ్వేతా త్రిపాఠి.. ఇందులో తాను పోషించిన గోలు పాత్ర ఎంతో ప్రత్యేకమైనదని తెలిపింది. మూడో సీజన్ కోసం ఎదురుచూస్తున్నట్లు రాసుకొచ్చింది.

సీజన్ 3 కోసం ఫ్యాన్స్ ఆత్రుత
'మీర్జాపూర్' సిరీస్పై అభిమానం పెంచుకున్న ప్రేక్షకులు.. కొత్త సీజన్ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. "రెండు సీజన్లుగా విడుదలైన మీర్జాపూర్.. సంచలనంగా మారింది. ఓటీటీలో విడుదలైన కొద్దిరోజుల్లోనే సోషల్మీడియాలో మీమ్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు మా వెబ్సిరీస్ను ఆదరించడం పట్ల ఎంతో కృతజ్ఞతతో ఉన్నాం" అని నిర్మాతల్లో ఒకరైన రితేశ్ సిద్వానీ అన్నారు.