ఓటీటీలో 'వకీల్సాబ్' సందడి చేస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే అనుకున్న సమయం కంటే ముందు అందుబాటులోకి రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఇంతకీ ఏం జరిగింది?
ఏప్రిల్ 9న 'వకీల్సాబ్' థియేటర్లలోకి వచ్చింది. అయితే సినిమా త్వరలో ఓటీటీలో రిలీజ్ చేస్తారనే వార్తలు వినిపించిన నేపథ్యంలో నిర్మాత దిల్రాజు అప్పుడే స్పందించారు. రిలీజైన 50 రోజుల తర్వాత ఓటీటీలోకి పెడతామని చెప్పారు. కానీ ఇప్పుడు మూడు వారాలైనా కాకముందే నెటిజన్లకు అందుబాటులోకి వచ్చింది.
అయితే చెప్పిన తేదీ కంటే ముందు రిలీజ్ చేసుకునేందుకు అమెజాన్ ప్రైమ్.. నిర్మాత దిల్రాజుకు దాదాపు రూ.12 కోట్లు అదనంగా చెల్లించనట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.
ఇది చదవండి: రివ్యూ: పవన్ 'వకీల్సాబ్ 'ఎలా ఉందంటే?