ETV Bharat / sitara

Allu Arjun: రోడ్డు పక్కన హోటల్​లో అల్లు అర్జున్​..

author img

By

Published : Sep 13, 2021, 4:07 PM IST

Updated : Sep 13, 2021, 5:32 PM IST

ఐకాన్ స్టార్ బన్నీ.. తన సింప్లిసిటీ చూపించారు. 'పుష్ప' షూటింగ్​కు వెళ్తూ, రోడ్డు పక్కన ఓ హోటల్​లో అల్పహారం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్​గా మారింది.

Allu Arjun ate at a roadside hotel
అల్లు అర్జున్

ప్రముఖ నటుడు అల్లు అర్జున్(allu arjun) రోడ్డు పక్కన ఉండే చిన్న హోటల్‌లో తినడం ఎప్పుడైనా చూశారా? అయినా ఆయన అలాంటి హోటల్‌కు ఎందుకెళ్తారనే కదా మీ సందేహం. దీనికి తగిన సమాధానం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అర్జున్‌, గోకవరంలోని ఓ కాకా హోటల్‌లో అల్పాహారం తీసుకుని, హోటల్ యజమానికి డబ్బులిస్తున్న వీడియోను ఎవరో సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. దీన్ని చూసిన నెటిజన్లు 'అల్లు అర్జున్‌ సింప్లిసిటీకి మారుపేరు' అంటూ కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

అల్లు అర్జున్ వైరల్ వీడియో

ఈ వీడియోలో అర్జున్‌ చాలా కూల్‌గా, స్టైలిష్‌గా కనిపించారు. అర్జున్‌ నటిస్తోన్న పాన్‌ ఇండియా చిత్రం 'పుష్ప'(pushpa movie release date) కాకినాడ పోర్టులో చిత్రీకరణ జరుగుతోంది. ఎర్ర చందనం అక్రమ రవాణాకు సంబంధించిన కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అర్జున్‌ ఇలా సరదాగా బయటికి వచ్చి, ఆ హోటల్‌కు వెళ్లారని తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. సుకుమార్‌ దర్శకుడు. రష్మిక(rashmika mandanna) కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 'ఆర్య', 'ఆర్య 2' చిత్రాల తర్వాత సుకుమార్‌- అర్జున్‌ కలిసి పనిచేస్తుండటం వల్ల 'పుష్ప'పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇవీ చదవండి:

ప్రముఖ నటుడు అల్లు అర్జున్(allu arjun) రోడ్డు పక్కన ఉండే చిన్న హోటల్‌లో తినడం ఎప్పుడైనా చూశారా? అయినా ఆయన అలాంటి హోటల్‌కు ఎందుకెళ్తారనే కదా మీ సందేహం. దీనికి తగిన సమాధానం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అర్జున్‌, గోకవరంలోని ఓ కాకా హోటల్‌లో అల్పాహారం తీసుకుని, హోటల్ యజమానికి డబ్బులిస్తున్న వీడియోను ఎవరో సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. దీన్ని చూసిన నెటిజన్లు 'అల్లు అర్జున్‌ సింప్లిసిటీకి మారుపేరు' అంటూ కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

అల్లు అర్జున్ వైరల్ వీడియో

ఈ వీడియోలో అర్జున్‌ చాలా కూల్‌గా, స్టైలిష్‌గా కనిపించారు. అర్జున్‌ నటిస్తోన్న పాన్‌ ఇండియా చిత్రం 'పుష్ప'(pushpa movie release date) కాకినాడ పోర్టులో చిత్రీకరణ జరుగుతోంది. ఎర్ర చందనం అక్రమ రవాణాకు సంబంధించిన కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అర్జున్‌ ఇలా సరదాగా బయటికి వచ్చి, ఆ హోటల్‌కు వెళ్లారని తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. సుకుమార్‌ దర్శకుడు. రష్మిక(rashmika mandanna) కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 'ఆర్య', 'ఆర్య 2' చిత్రాల తర్వాత సుకుమార్‌- అర్జున్‌ కలిసి పనిచేస్తుండటం వల్ల 'పుష్ప'పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇవీ చదవండి:

Last Updated : Sep 13, 2021, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.