ETV Bharat / sitara

'దోస్తానా 2'కు అక్షయ్​ గ్రీన్​సిగ్నల్​ ఇస్తాడా?

author img

By

Published : Apr 21, 2021, 5:22 PM IST

'దోస్తానా 2' సినిమా నుంచి తప్పుకున్న కార్తిక్​ ఆర్యన్​ స్థానంలో స్టార్​ హీరో అక్షయ్​కుమార్​ను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

Akshay Kumar karan johar
అక్షయ్ కుమార్ కరణ్ జోహార్

ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ 2019లో 'దోస్తానా2' నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. కోలిన్‌ డికున్హా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇందులో జాన్వీ కపూర్‌, కార్తిక్‌ ఆర్యన్‌, లక్ష్య లల్వాని నటించాల్సింది. కొన్ని కారణాల వల్ల కార్తిక్​ నటించట్లేదని ఇటీవల తెలిపింది నిర్మాణ సంస్థ. ఇప్పుడతడి స్థానంలో స్టార్​ హీరో అక్షయ్​కుమార్​ను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తుందని సమాచారం. ఇప్పటికే ధర్మ ప్రొడక్షన్స్​ అధినేత కరణ్​ జోహార్​​.. అక్షయ్​ను సంప్రదించి చర్చలు జరిపారని తెలిసింది. మరి దీనికి ఖిలాడి హీరో గ్రీన్​ సిగ్నల్​ ఇస్తాడో లేదో చూడాలి. అక్షయ్​ కన్నా ముందు
విక్కీ కౌషల్​, రాజ్​కుమార్​ రావ్​ను తీసుకోవాలని చిత్రబృందం భావించిందని వినికిడి.

కార్తిక్​ అందుకే ఔట్
2019 నవంబర్లో‌నే 'దోస్తానా 2' సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత కరోనా కారణంగా షూటింగ్‌ వాయిదా పడింది. అయితే ఈ చిత్రకథకు సంబంధించి హీరో కార్తీక్‌ కొన్ని మార్పులు చేయాలని సూచించాడట. అందుకు నిర్మాత కరణ్‌జోహార్‌ సైతం అంగీకారం తెలిపారట. కానీ కార్తిక్‌ కాల్షీట్స్ సరిగ్గా కేటాయించకపోవడం వల్ల అతని స్థానంలో మరొకరిని తీసుకోనున్నారని భావించి కార్తిక్​ను తప్పించారని తెలిసింది. ప్రస్తుతం కార్తిక్‌ - అనీష్‌ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర్రర్ చిత్రం "భూల్‌ భులయ్య2"లో నటిస్తున్నాడు. ఇందులో కియారా అడ్వాణీ కథానాయిక.

ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ 2019లో 'దోస్తానా2' నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. కోలిన్‌ డికున్హా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇందులో జాన్వీ కపూర్‌, కార్తిక్‌ ఆర్యన్‌, లక్ష్య లల్వాని నటించాల్సింది. కొన్ని కారణాల వల్ల కార్తిక్​ నటించట్లేదని ఇటీవల తెలిపింది నిర్మాణ సంస్థ. ఇప్పుడతడి స్థానంలో స్టార్​ హీరో అక్షయ్​కుమార్​ను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తుందని సమాచారం. ఇప్పటికే ధర్మ ప్రొడక్షన్స్​ అధినేత కరణ్​ జోహార్​​.. అక్షయ్​ను సంప్రదించి చర్చలు జరిపారని తెలిసింది. మరి దీనికి ఖిలాడి హీరో గ్రీన్​ సిగ్నల్​ ఇస్తాడో లేదో చూడాలి. అక్షయ్​ కన్నా ముందు
విక్కీ కౌషల్​, రాజ్​కుమార్​ రావ్​ను తీసుకోవాలని చిత్రబృందం భావించిందని వినికిడి.

కార్తిక్​ అందుకే ఔట్
2019 నవంబర్లో‌నే 'దోస్తానా 2' సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత కరోనా కారణంగా షూటింగ్‌ వాయిదా పడింది. అయితే ఈ చిత్రకథకు సంబంధించి హీరో కార్తీక్‌ కొన్ని మార్పులు చేయాలని సూచించాడట. అందుకు నిర్మాత కరణ్‌జోహార్‌ సైతం అంగీకారం తెలిపారట. కానీ కార్తిక్‌ కాల్షీట్స్ సరిగ్గా కేటాయించకపోవడం వల్ల అతని స్థానంలో మరొకరిని తీసుకోనున్నారని భావించి కార్తిక్​ను తప్పించారని తెలిసింది. ప్రస్తుతం కార్తిక్‌ - అనీష్‌ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర్రర్ చిత్రం "భూల్‌ భులయ్య2"లో నటిస్తున్నాడు. ఇందులో కియారా అడ్వాణీ కథానాయిక.

ఇవీ చదవండి: బాలీవుడ్​ నటుడు అక్షయ్ కుమార్​​కు కరోనా

అక్షయ్ సినిమా వాయిదా- షూటింగ్​లో రకుల్ ప్రీత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.