ETV Bharat / sitara

పోలీస్ ఫౌండేషన్​కు అక్షయ్ కుమార్ భారీ విరాళం

author img

By

Published : Apr 27, 2020, 6:59 PM IST

ఇప్పటికే ప్రధానమంత్రి సహాయనిధి, ముంబయి మున్సిపల్ కార్పోరేషన్​లకు భారీ విరాళాలిచ్చిన హీరో అక్షయ్ కుమార్.. నేడు(సోమవారం).. ముంబయి పోలీస్ ఫౌండేషన్​కు రూ.2 కోట్లు విరాళమిచ్చారు.

Akshay Kumar donates Rs 2 crore to Mumbai Police Foundation
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్.. మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. లాక్​డౌన్​లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల సంరక్షణ కోసం ముంబయి పోలీస్ ఫౌండేషన్​కు రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని ముంబయి పోలీస్ కమీషనర్ పరమ్​బీర్ సింగ్ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. అక్షయ్​కు ధన్యవాదాలు తెలిపారు.

అంతకముందు ఈ విషయంపై ట్వీట్ చేసిన అక్షయ్.. కొవిడ్ విధుల్లో భాగంగా ప్రాణాలర్పించిన హెడ్​ కానిస్టేబుల్స్ చంద్రకాంత్ పెందుర్కర్, సందీప్ సర్వ్​లకు నివాళి అర్పించారు. పోలీస్ ఫౌండేషన్​కు అభిమానులు విరాళం ఇవ్వాలని కోరారు.

కరోనా కట్టడిలో భాగంగా ఇప్పటికే ప్రధానమంత్రి సహాయనిధికి రూ.25కోట్లు విరాళమిచ్చారు అక్షయ్. దీనితో పాటే ముంబయి మున్సిపల్ కార్పోరేషన్​కు రూ.3 కోట్లు విరాళం ప్రకటించారు. ఈ మొత్తంతో ఉద్యోగులకు పీపీఈ కిట్స్, మాస్క్​లు, శానిటైజర్​లు అందించారు.

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్.. మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. లాక్​డౌన్​లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల సంరక్షణ కోసం ముంబయి పోలీస్ ఫౌండేషన్​కు రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని ముంబయి పోలీస్ కమీషనర్ పరమ్​బీర్ సింగ్ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. అక్షయ్​కు ధన్యవాదాలు తెలిపారు.

అంతకముందు ఈ విషయంపై ట్వీట్ చేసిన అక్షయ్.. కొవిడ్ విధుల్లో భాగంగా ప్రాణాలర్పించిన హెడ్​ కానిస్టేబుల్స్ చంద్రకాంత్ పెందుర్కర్, సందీప్ సర్వ్​లకు నివాళి అర్పించారు. పోలీస్ ఫౌండేషన్​కు అభిమానులు విరాళం ఇవ్వాలని కోరారు.

కరోనా కట్టడిలో భాగంగా ఇప్పటికే ప్రధానమంత్రి సహాయనిధికి రూ.25కోట్లు విరాళమిచ్చారు అక్షయ్. దీనితో పాటే ముంబయి మున్సిపల్ కార్పోరేషన్​కు రూ.3 కోట్లు విరాళం ప్రకటించారు. ఈ మొత్తంతో ఉద్యోగులకు పీపీఈ కిట్స్, మాస్క్​లు, శానిటైజర్​లు అందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.