ETV Bharat / sitara

ఫ్యాన్స్​కు సారీ చెప్పిన 'మహాసముద్రం' డైరెక్టర్

author img

By

Published : Oct 29, 2021, 11:03 AM IST

'మహాసముద్రం' సినిమాతో అంచనాలు అందుకోలేకపోయానని డైరెక్టర్ అజయ్ భూపతి అన్నారు. ఓ అభిమాని ట్వీట్​కు రిప్లై ఇస్తూ.. ఇలా చెప్పుకొచ్చారు.

ajay bhupathi
డైరెక్టర్ అజయ్ భూపతి

'ఆర్‌ఎక్స్‌ 100' (RX100) వంటి ఇంటెన్స్ ప్రేమకథా చిత్రంతో తొలి ప్రయత్నంలోనే సూపర్‌హిట్‌ అందుకున్నారు దర్శకుడు అజయ్‌ భూపతి (Ajay Bhupathi). ఆ సినిమా విజయంతో ఆయనకు యువతలో క్రేజ్‌ పెరిగింది. ఈ క్రమంలోనే ఆయన తీసిన సరికొత్త చిత్రం 'మహాసముద్రం' (MahaSamudram).

ప్రేమ, స్నేహాం, వైరం వంటి సున్నితమైన అంశాలతో సిద్ధమైన ఈ కథ అజయ్‌ భూపతి కలల ప్రాజెక్ట్‌గా ప్రచారం పొందింది. ఇలా, భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అనుకున్నంత విజయాన్ని అందుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్‌ అజయ్‌ భూపతిని ట్యాగ్‌ చేస్తూ.. "మహాసముద్రంపై మేము ఎన్నో అంచనాలు పెట్టుకున్నాం అన్నా.. ఎందుకు అలా తీశావు" అని ట్వీట్‌ చేశాడు. దానిపై స్పందించిన అజయ్‌ క్షమాపణలు తెలిపారు.

  • Sorry for not reaching your expectations... Next time I will be back with a story that can satisfy you all... https://t.co/RTWin30gKV

    — Ajay Bhupathi (@DirAjayBhupathi) October 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మీ అంచనాలు అందుకోలేకపోయినందుకు నన్ను క్షమించండి. అందర్నీ సంతృప్తి పరిచే కథతో త్వరలోనే మీ ముందుకు వస్తాను" అని అజయ్‌ రిప్లై ఇచ్చారు.

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మహాసముద్రం'. విభిన్న ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్‌, అదితి రావు హైదరీ కథానాయికలుగా నటించారు. జగపతిబాబు, రావు రమేశ్ కీలకపాత్రలు పోషించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మాం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇవీ చదవండి:

'ఆర్‌ఎక్స్‌ 100' (RX100) వంటి ఇంటెన్స్ ప్రేమకథా చిత్రంతో తొలి ప్రయత్నంలోనే సూపర్‌హిట్‌ అందుకున్నారు దర్శకుడు అజయ్‌ భూపతి (Ajay Bhupathi). ఆ సినిమా విజయంతో ఆయనకు యువతలో క్రేజ్‌ పెరిగింది. ఈ క్రమంలోనే ఆయన తీసిన సరికొత్త చిత్రం 'మహాసముద్రం' (MahaSamudram).

ప్రేమ, స్నేహాం, వైరం వంటి సున్నితమైన అంశాలతో సిద్ధమైన ఈ కథ అజయ్‌ భూపతి కలల ప్రాజెక్ట్‌గా ప్రచారం పొందింది. ఇలా, భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అనుకున్నంత విజయాన్ని అందుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్‌ అజయ్‌ భూపతిని ట్యాగ్‌ చేస్తూ.. "మహాసముద్రంపై మేము ఎన్నో అంచనాలు పెట్టుకున్నాం అన్నా.. ఎందుకు అలా తీశావు" అని ట్వీట్‌ చేశాడు. దానిపై స్పందించిన అజయ్‌ క్షమాపణలు తెలిపారు.

  • Sorry for not reaching your expectations... Next time I will be back with a story that can satisfy you all... https://t.co/RTWin30gKV

    — Ajay Bhupathi (@DirAjayBhupathi) October 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మీ అంచనాలు అందుకోలేకపోయినందుకు నన్ను క్షమించండి. అందర్నీ సంతృప్తి పరిచే కథతో త్వరలోనే మీ ముందుకు వస్తాను" అని అజయ్‌ రిప్లై ఇచ్చారు.

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మహాసముద్రం'. విభిన్న ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్‌, అదితి రావు హైదరీ కథానాయికలుగా నటించారు. జగపతిబాబు, రావు రమేశ్ కీలకపాత్రలు పోషించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మాం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.